ధరణిలో మొసాలు : నష్టపోతున్న పట్టా దారులు..ముడుపుల మత్తులో.. రెవెన్యూ శాఖ

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 :

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల జరుగుతున్న మోసాలకు అంతులేకుండా పోతున్నాయి. ముడుపుల ముడితే చాలు ఎలాంటి దళారి పనులకైన, వెనుకాడని రెవెన్యూ అధికారులతో అసలు పట్టాదారులు నష్టపోతున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ బస్వాపూర్ లో గడిచిన 30 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన తాడెం.కనకయ్య తండ్రి చంద్రయ్య తనకున్న వ్యవసాయ భూమి రెండు ఎకరాల, ఇరువై ఆరు గుంటలను (2.26) అమ్ముకొని, మరొక ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్మెట కు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. తాను అమ్మిన భూములన్నీ అప్పుడున్న భూ పోర్టల్ సర్వే ప్రకారం అతని పెరు పై నమోదై ఉన్నాయి. అయితే ఆ భూమిని కొనుగోలు చేసిన సదరు వ్యక్తుల వద్ద సరైన విక్రయ పత్రాలు (సర్వే నంబర్లు) లేకపోవడంతో, ఇప్పుడొచ్చిన ధరణిలో కొనుగోలు చేసిన వ్యక్తులకు భూమి పట్టా కాలేదు. ప్రస్తుత ధరణి పోర్టల్ “996/13, 1130/9/1, 1130/9/2, 1330/ఆ/f, 1351అ/2, 1357/1/7, 1391/2″ సర్వే నంబర్లలో ఉన్న (2.19) భూమిని గ్రామానికి చెందిన దళారులు గుర్తించి, భూమి అమ్మిన వ్యక్తితో మంతనాలు జరిపి, రెవెన్యూ అధికారుల అండదండాలతో గుట్టు చప్పుడు కాకుండా దళారులు వారి పక్షాన సోమవారం భూములను పట్టా చేయించుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రస్తుత పట్టాదారులు ఆ భూమిని వేరొకరి పేరు మీద పట్టా చేయొద్దని, గత కొద్ది సంవత్సరాలుగా మేమే కాస్తులో ఉంటున్నామని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి లాభం లేకుండా పోయింది. సదరు భూమిని యదేచ్ఛగా రెవెన్యూ అధికారులు వేరొకరికి పట్టా చేసి, సెలవు తీసుకోవడం కోస మెరుపు, దీంతో అసలు పట్టాదారులు లబోదిబోమంటున్నారు. తమ భూములు దురాక్రమనకు గురవుతున్నాయని, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై అంశంపై కోహెడ రెవెన్యూ అధికారులను “జనసముద్రం న్యూస్ వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు వెలువడుతున్నాయి. ఇక దీనిపై పై అధికారులు ఎలా స్పందిస్తారో… వేచి చూడాలి.

Related Posts

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

Spread the love

Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!