ఏపి కి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదు..కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ క్లారిటీ..!

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 12:

ప్రత్యేక హోదా కావాలి. ఇది ఏపీ జనం కోరిక. ఆ కోరికను పుట్టించింది కూడా రాజకీయ పార్టీలే. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మాట్లాడింది. బీజేపీ అయితే విపక్షం నుంచి బిగ్ సౌండ్ చేస్తూ అయిదేళ్ళు కాదు పదేళ్ళు ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది. మొత్తానికి ప్రధాని మన్మోహన్ సింగ్ నాడు రాజ్యసభ సాక్షిగా ప్రత్యేక హోదా మీద బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఆ తరువాత జరిగిన ఎన్నికల సభల్లో కూడా ఏపీలో ఊరూరా తిరుగుతూ బీజేపీ ప్రత్యేక హోదా మీద చాలానే మాట్లాడింది. అయితే తీరా అధికారంలోకి వచ్చాక  నాలిక మడతేసింది. అది లగాయితూ ఆ మాట మీదనే కట్టుబడిపోయింది. దీనికి బీజేపీని మెచ్చాలో లేక మొదటి మాటను మడతేసినందుకు నిందించాలో ఏమీ అర్ధం కాని పరిస్థితి.

పార్లమెంట్ సమవేశాలు జరిగిన ప్రతీ సారీ ఎవరో ఒకరు హోదా గురించి అడుగుతారు. దానికి బదులుగా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెబుతూ వస్తుంది. ఈ తంతు ఛాలా కాలంగా సాగుతూనే ఉంది. ఇపుడు మరోసారి అదే మాట బీజేపీ నోట వచ్చింది. ఆ పార్టీకి చెందిన మంత్రి ఇంద్రజిత్ సింగ్  పార్లమెంట్ లో తాజాగా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే లేదు అని చెప్పేశారు.అది ముగిసిన అధ్యాయమని చెప్పారు. గతంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యేక హోదా కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారని ఇపుడు జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు  ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు ఏమీ తేడా చూపించకుండా అందరికీ ఒకేలా పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని గుర్తు చేశారు. అందువల్ల ప్రత్యేక హోదా అన్నది లేనే లేదని ఆయన మళ్ళీ తేల్చేశారు.

అంతే కాదు ఏపీకి సంబంధించి రెవిన్యూ లోటు పూడ్చేందుకు కూడా గ్రాంట్స్ ఇస్తున్నాం కాబట్టి ప్రత్యేక హోదా అన్నది మరచిపోవచ్చు అని మంత్రివర్యులు తాపీగా సెలవిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఇచ్చేది లేదని ఈ విషయంలో రెండవ మాట లేదు ఇదే చివరి మాట అని ఆయన స్పష్టం చేశారు.అయినా ఏపీలో ప్రత్యేక హోదా గురించి ఎవరూ గట్టిగా మాట్లాడుతున్న సందర్భం ఏదైనా ఉందా. అసలు ఆ ఊసు అయినా ఎవరికైనా గుర్తు ఉందా. ఏదో రాజకీయ లాభానికో మరో దానికో ఆ మాటను అపుడపుడు గుర్తు చేసుకుంటారు. ఏపీలో అన్ని పార్టీలూ బీజేపీకి నేస్తాలే. వారు కమలం పువ్వు  పార్టీ ఎలా చెబితే అలా నడచుకుంటాయని కూడా తెలుసు. మరి కేంద్రానికి ఏమి బెరుకు ఏమి బెంగ. అందుకే హోదా లేదూ గీదా లేదూ అంటోంది. అదన్న మాట మ్యాటర్.

Related Posts

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

Spread the love

Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం