జన సముద్రం న్యూస్ యాదాద్రి
భువనగిరి జిల్లా:__
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దీవిస్ లెబోరేటరిస్ లిమిటెడ్” రూ.4,65,000/- విలువగల 685 బ్లీచింగ్ పౌడర్, 685 సున్నం బస్తాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుకు అందజేయడం జరిగింది.
అదనపు కలెక్టర్ మాట్లాడు తూ భువనగిరి జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం పనులకు గాను దివిస్ సంస్థ ఎల్లప్పుడు కృషి చేస్తుందని అన్నారు. గ్రామాలలోని మురికి కాలువలో నీరు నిల్వ ఉండే ప్రదేశాల బ్లీచింగ్ చల్లడం వలన దోమలను అరికట్టవచ్చు. గ్రామపంచాయతీ అధికారులందరూ ప్రతి గ్రామపంచాయతీలో బ్లీచింగ్ బ్యాగులును తీసుకొని సద్వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఇంచార్జి విష్ణువర్ధన్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్ ప్రసాద్, డిపిఎల్ఓ శ్రీకాంత్ రెడ్డి దివిస్(ప్రతినిధి లైజన్ ఆఫీసర్ బి. కిషోర్ కుమార్ పాల్గొన్నారు..






