
తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్ 2025–2026, సంవత్సరానికి 4 తరగతికి సెలక్షన్స్
జిల్లా కమ్యూనిటీ మొబిలేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి
మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ
జనసముద్రం న్యూస్ 21
ఎల్కతుర్తి మండలం.
ఎల్కతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ పొందుటకు 4వ తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థినీలకు మండల స్థాయిలో కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మైదానంలో సెలక్షన్స్ జరిగినవి.ఇట్టి కార్యక్రమానికి హాజరైన జిల్లా కమ్యూనిటీ మొబిలేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు సెలెక్ట్ అయిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగే సెలక్షన్స్ కు అర్వత పొంది క్రీడా పాఠశాలలో అడ్మిషన్ పొందాలని తెలిపారు.మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు యోగ లాంటివి నేర్పించి వారి సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడాలని తెలిపారు.దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల లో ప్రతిభ కనబరిచిన పదిమంది బాలురు 10 మంది బాలికలు మొత్తం 20 మంది విద్యార్థులను ఈ రోజు ఎంపిక చేసి జిల్లా స్థాయి సెలక్షన్స్ కు పంపడం జరిగింది అని తెలిపారు.ఆ తదుపరి జిల్లా పరిషత్ బాలికల పాఠశాల దామర లో సామూహిక వన మహోత్చవం కార్యక్రమం సీ.యం.ఒ
అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మొక్కలను విధిగా పెంచే బాధ్యత వాటిని రక్షించే బాధ్యత ప్రతి విద్యార్థి తీసుకోవాలని ప్రతి పాఠశాల పచ్చదనంతో ఆకర్షణీయంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుమారు 100 మొక్కలు నాటిన పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు,ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరైన అధికారులు అందరూ పాల్గొని నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో పనిచేయుచున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాముడు ప్రేమ్ ప్రసాద్ సుధాకర్ దివ్య స్వరూప శ్రీకాంత్ ఉపాధ్యాయులు తిరుపతి హరికృష్ణ శ్రీనివాస్ ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు.