
మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి అవమానించిన వైనం
కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసిన దారుణం
అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసి మహిళను చిత్రహింసలు
జనసముద్రం న్యూస్, చిత్తూరు, జూన్ 18:-
నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25)
భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 వేలు రూపాయలు అప్పు తీసుకున్నారు.అప్పు తీర్చలేక భార్య శిరీష (25) బిడ్డలను గ్రామo లోనే వదిలి వెళ్ళిపోయిన భర్త తిమ్మరాయప్ప. కూలీ పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీష.సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అప్పు తీర్చలేదని అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పుడబ్బులు ఇవ్వకపోతే చంపిస్తామని బెదిరింపులు. అంతేకాకుండా
ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టు కు శిరీష ను కట్టేసిన కొట్టిన మునికన్నప్ప అంతేకాకుండా సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న స్థానికులపై భౌతిక దాడిచేసాడు. స్థానికులు కుప్పం పోలీసులకు సమాచారు. టిడిపి కార్యకర్త మునికన్నప్పపై
BNS 341/323/324/506/34/ IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మునికన్నప్ప ను పాలసీసులు అదుపులో కి తీసుకున్నారు.
ఈ సంఘటన పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు అరా తీసి దాడి చేసిన వారిని పై కఠినంగా చట్ట పరమైన చర్యలు తీసుకోమన్నారు.