జనసముద్రంన్యూస్:బిక్కవోలు
జూన్:15
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు తో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
బలభద్రపురం గ్రామంలో లబ్దిదారులుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఇంతకు ముందు ప్రభుత్వం లో ఇంటికి ఒక్కరే 15000 వచ్చింది అని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటిలో చదువుకొనే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 15000 వచ్చింది అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లికి వందనం పథకం అర్హులైన వారి అందరికి అందుతుంది అని ఇంకా ఎవరికైనా ఏవిధమైన సమస్యలు ఉన్నా స్థానిక సచివాలయంలో సంప్రదించాలిని తెలియజేసారు.త్వరలోనే మిగితా పథకాలు కూడా అమలు చేస్తామన్నారు..
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నల్లమిల్లి సుబ్బారెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి(దత్తడు),మల్లిడి సుబ్బారెడ్డి,(గ్రామశాఖ అధ్యక్షులు)మరియ ఎన్డీయే నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..





