లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూన్ 15
లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిలేవుల గ్రామం ఇడిగి పల్లి నందు ఉన్న సచివాలయంలో శనివారం ఉదయం 7.30గంటల నుంచి 8.30 గంటల వరకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రజిని రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేయడం వలన మానసిక ఆనందంతో పాటు శారీరిక దారుఢ్యం ఏర్పడుతుందని ఆరోగ్యంగా ఉండొచ్చని వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని ఒకవేళ వ్యాధులు ఉన్న యోగా చేయడం వలన నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలియజేశారు అందువలన ప్రతి ఒక్కరూ యోగ చేయడం అలవాటు చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది రజనీష్ రెడ్డి,సిరి బాబు, లావణ్య, నందిని, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు,అంగన్వాడి టీచర్లు నాగవేణి, లక్ష్మీదేవి, పవన్ కుమారి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు





