శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న చమర్తి.
కోన రాచపల్లి నందు బండలాగుడు పోటీలను ప్రారంభించిన చమర్తి.

ఒంటిమిట్ట జనసముద్రం న్యూస్ జూన్ 8
ఒంటిమిట్ట మండలం కోన రాచపల్లి గ్రామస్తులు ఆహ్వానం మేరకు శనివారంశ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి తృతీయ వార్షికోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీరాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారికి గ్రామస్తులు బ్యాండ్ వాయిద్యాల మధ్య టపాసులు పేలుస్తూ ఘన స్వాగతం పలుకుతూ చమర్తికి మరియు తెలుగు తమ్ముళ్లకు దుశ్యాలువ కప్పి ఘనంగా సన్మానించిన కోన రాచ పల్లి గ్రామస్తులు అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగినది. అంతేకాకుండా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన జోడెద్దుల బండలాగుడు పోటీలను చమర్తి ప్రారంభించడం జరిగినది. అంతేకాకుండా అక్కడ ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలకు మొదటి బహుమతిగా రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుగారు 50,000 వేల రూపాయలు ప్రకటించడం జరిగినది. రెండవ బహుమతిగా గీతాంజలి విద్యాసంస్థల అధినేత గీతాంజలి రమణ 40,000, మరియు ఒంటిమిట్ట టిడిపి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి మరియు ఎస్వీ రమణ వారిరువురూ కలిపి మూడో బహుమతిగా 30,000 వేల రూపాయలు ప్రకటించడం జరిగినది.*
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట టిడిపి మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, గీతాంజలి రమణ,ఎస్ వి రమణ,బొబ్బిలి రాయుడు, నందలూరు క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్,రమణ, మాజీ సర్పంచ్ బాలి పోగు సుబ్బయ్య, మాజీ సర్పంచ్ భాష, ఎస్ మస్తాన్, ముద్దు కృష్ణారెడ్డి, దేవగిరి సుబ్బ నరసయ్య, సగినాల నరసింహులు, వెంకటరమణ, బన్నీ, సుబ్బానాయుడు, మహేష్ నాయుడు,సుబ్రహ్మణ్యం నాయుడు,పరుశురాం నాయుడు,పలువురు టిడిపి ముఖ్య నాయకులు, మహిళలు, గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.





