భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం

Spread the love

రాష్ట్రంలో 10,954 గ్రామాల్లో జూన్ 2 నుండి ఆగస్టు 15 వరకు
రెవెన్యూ సదస్సులు

భూ భారతి చట్టం రూపకర్త రాష్ట్ర అగ్రికల్చర్ రైతు కమిషన్ డైరెక్టర్ సునీల్ వెల్లడి

కామేపల్లి జనసముద్రం :
రాష్ట్రంలో భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారని భూభారతి చట్టం రూపకర్త రాష్ట్ర వ్యవసాయ కమిషన్ డైరెక్టర్ సునీల్ వెల్లడించారు. మండలంలోని కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో బుధవారం నిర్వహించిన భూభారతి అవగాహన మండల స్థాయి సదస్సు తహసిల్దార్ సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ రైతులు తమకు పాస్ పుస్తకాల్లో భూమి సంబంధించిన మ్యాప్ కావాలని తాసిల్దారులకు దరఖాస్తు ఇస్తే లైసెన్సు సర్వేయర్ ద్వారా భూమిని కొలిచి మ్యాప్ కూడా పాస్ పుస్తకం లో అచ్చు వేసి రైతులకు అందజేస్తారని వెల్లడించారు. గతంలో పహానిల్లో మార్పులు చేర్పులు చేశారని ఈ చట్టం ద్వారా సంవత్సర కాలం పాటు కంప్యూటర్లో ఉండే పహానిలు మారకుండా ఉండడానికి ప్రతి ఏడాది రికార్డులను భద్రపరచటం జరుగుతుందని తెలిపారు.రైతులు కోర్టులకు పోవాల్సిన పనిలేదని ఆర్డీవో, జిల్లా కలెక్టర్ స్థాయిలలో వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు న్యాయ సహాయం రెవిన్యూ అధికారులే అందిస్తారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు భూదార్ కార్డులు అందించడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో 10954 రెవిన్యూ గ్రామాల్లో జూన్ 2 తేదీ నుండి ఆగస్టు 15 వరకు
రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉందని తెలిపారు . రైతులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు అందజేయడంతో పాటు భూ సమస్యలను ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వం‌ పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి,డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, కామేపల్లి, కొండాయిగూడెం సొసైటీ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, హనుమంతరావు, ఎంపీడీవో రవీందర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ తార దేవి, వెలుగు ఏపిఎం శ్యామ్, డిప్యూటీ తాసిల్దార్ రఫీ పలువురు అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

  • Related Posts

    సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరం

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61…

    తీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం