జన సముద్రం న్యూస్,ఫిబ్రవరి 28 పుల్లలచెరువు .
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వైసిపి కార్యకర్త కంచర్ల.వీర ప్రసాద్ ను ఎర్రగొండపాలెం శాసన సభ్యులు తాటిపర్తి.చంద్రశేఖర్ గురువారం పరామర్శించారు.మండల కేంద్రమైన పుల్లల చెరువు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కంచర్ల.వీరప్రసాద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి,నరసరావుపేట లోని సాయి తిరుమల ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న ఎమ్యెల్యే తాటిపర్తి నరసరావుపేట లోని వైద్యశాలకు గురువారం వెళ్ళి పరామర్శించారు.రోడ్డు ప్రమాద వివరాలను,వీర ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.వైద్యశాల ఎండి తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్యెల్యే కోరారు.పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో వైసీపినాయకులు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.





