ట్రెజరీలో చోరీకి పాల్పడిన అటెండర్ అరెస్టు – డి.ఎస్పీ సుధాకర్..!!

Spread the love

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ అక్టోబర్ 8 జన సముద్రం న్యూస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గంలో.. రాజంపేట డివిజన్ ట్రెజరీ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తూ చోరీకి పాల్పడిన వెంకాల విష్ణువర్థన్ రెడ్డిని (32) అరెస్టు చేసినట్లు
రాజంపేట డి.ఎస్పీ సుధాకర్ తెలిపారు. సోమవారం అర్బన్ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి.ఎస్పీ మాట్లాడుతూ విష్ణువర్థన్ రెడ్డి ని
సబ్ ట్రెజరీ ఆఫీసర్ పి రమేష్ రెడ్డి, సీనియర్ అకౌంటెంట్ సాదక్ బాష లు అవమా నకరంగా తక్కువ చేసి మాట్లాడుతుండడంతో మనస్థాపం చెందారన్నారు. తనను మనస్థాపానికి గురి చేస్తున్న రమేష్ రెడ్డిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతో స్ర్టాంగ్ రూములో వున్న ఏదైనా వస్తువులు దొంగలిస్తే ఎస్.టి.ఓ పై చర్యలు వుంటాయని భావించారన్నారు. ఇందులో భాగంగా గత నెల 13వ తేదీన మధ్యాహ్నానం సమయంలో ఎస్.టి.ఓ, ఏ.టి.ఓ లు స్ర్టాంగ్ రూమ్ తాళాలు తెరిచి వున్నసమయంలో స్ర్టాంగ్ రూమ్ లోకి వెళ్లి చెక్క బీరువాలో వున్న రూ.12 వేలు నగదు, సీల్ చేసి అట్టపెట్టెలో వున్న 20.800 గ్రాముల బంగారు నాణేములను చోరీ చేసి ఇంట్లో దాచుకు న్నారన్నారు. గత నెల 21వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు వారి వద్ద దాచిన రూ.12 వేలు తిరిగి ఇవ్వమని సీనియర్ అకౌంటెంట్ సాదక్ బాష ను అడగడంతో దొంగతనం విషయం బయట పడిందన్నారు. ఈ విషయమై జిల్లా ట్రెజరీ మరియు అకౌంట్స్ ఆఫీసర్ సయ్యద్ మహబూబ్ సెప్టెంబరు 30వ తేదీన అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు తన ఆధ్వర్యంలో సి.ఐ కె యల్లమరాజు, ఎస్.ఐలు వి నాగేశ్వరరావు, వి. లక్ష్మి ప్రసాద్ రెడ్డి లు తమ సిబ్బందితో ఒక టీంగా ఏర్పాటు చేసి డ్యూటీకి గైర్హాజరు అవుతున్న అనుమానాస్పద ముద్దాయి అయిన అటెండర్ విష్ణువర్థన్ రెడ్డి పై నిఘా వుంచి సోమవారం ఉదయం 8 గంటల సమయంలో రాజంపేట పట్టణంలోని కొత్త బస్టాండు వద్ద వున్న కడప -రాజంపేట మెయిన్ రోడ్డు పైన అరెస్టు చేశామన్నారు. కడప నగరం ఎర్రముక్కపల్లెలో నివాసం వుంటున్న విష్ణువర్థన్ రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడిన 78 ఓల్డ్ కాయిన్స్, ఒక జత పోగులు (చెవి రింగులు), రెండు కొక్కిలు, డైమండ్ షఫర్ స్వార్స్ 9, మొర్రగుండ్లు 4, మొత్తం బరువు 20.800 గ్రాములు అన్నారు. అలాగే రూ.12 వేలు తన స్వంత ఖర్చుకు వాడుకున్నట్లు విచారణలో అంగీకరించా రన్నారు. ఈ కేసును త్వరితగతిన చేధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారన్నారు.
ఈ కార్యక్రమంలో… ASi వర్మ, పోలీసులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం