ఇంటి పై దాడి చేసిన వ్యక్తుల పై ఫిర్యాదు చేసిన బాధితురాలు రమాదేవి .

Spread the love

జన సముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి 18: ఆగస్టు

ఈ రోజు అనగా 2024 ఆగస్టు 9 న శనివారం రోజున జిల్లా పోలీసు అధికారి , జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్ పై అధికారుల అందరికీ బాధితురాలైన రమాదేవి ఫిర్యాదు చేయడం జరిగింది.
వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన కరీంనగర్ లో తన ఇంటి పై 9 ఆగస్టు రోజు నా దౌర్జన్యం చేస్తూ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి ఇంటి ఆవరణ చెట్లను నరికి వేస్తూ మారనయుధాలు చూపెడుతూ బెదిరిస్తూ తిడుతూ కొంత గోడ కూల్చి నానా విధాలుగా దుర్భాషలాడుతూ బయటికి రండి, సంపుతామంటూ, అనేక రకాలుగా బయటికి చెప్పడానికి వీలు లేని విధంగా బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురిచేసినా ఒంటెల సుమ, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, కొంతమంది మహిళలు వారి అనుచరులు వారికి సహకరించిన పోలీసులు అందరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని తన ఫిర్యాదులో వివిధ శాఖల అధికారులతో పాటు మునిసిపల్ రెవెన్యూ పోలీసు జిల్లా కలెక్టర్లుకు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని పై వెంటనే ఎఫైర్ నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని, వివిధ సంఘాలు సంఘీభావం మద్దతు తెలపడం జరిగింది. 2024 ఆగస్టు 9న తారీఖు రోజే నేను ఫిర్యాదు చేసినప్పటికీ నాకు ఇంత వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. అట్టి వారి పై ఎలాంటి చర్యలు గై కొనలేదు. మా ఇంటిపై ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎవరైనా దాడి చేసే అవకాశం ఉందని , అట్టివారితో ఎన్నటికైనా మాకు, మా కుటుంబానికి ప్రాణం భయం ఉన్నదని , రక్షణ కల్పించాలని ఒకవేళ మాకు మా కుటుంబ సభ్యులకు ఏమైనా జరుగుతే దానికి ఒంటెల సత్యనారాయణ రెడ్డి సుమ వారి అనుచరులు పోలీసులు అధికారులు పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని, తమగూడును విన్నవించుకోవడం జరిగింది. మాకు తగు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వ అధికారులను వేడు కుంటున్నాను అని తెలిపినది.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్, మదనపల్లి, జులై 26:- మదనపల్లె టమోటా మార్కెట్లో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశిగంజ్ జిల్లా, నంగులా తానాకు చెందిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం