మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు, భారీ జరిమానాలు విధిస్తాము.
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 9 జూలై
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన
జమ్మికుంట లో మంగళవారం రోజున జమ్మికుంట పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టి నెంబర్ ప్లేట్ లేని వాహనాలను, మైనర్లు నడిపిన వానలతో పాటు త్రిబుల్ రైడ్ చేసిన వాహనదారులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
53 ద్విచక్ర వాహనాలను పోలీసులు తనిఖీల్లో పట్టుకుని స్టేషన్ కు తరలించగా హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి వానదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జి వాహన దారులతో మాట్లాడుతూ ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ కనబడే విధంగా ఉండాలని, నెంబర్ ప్లేట్ల పైన అనవసరమైన రాతలు రాయవద్దని సూచించారు.
దానితోపాటు మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని,
భారీగా జరిమానాలు కూడా విధించబడతాయని తెలిపారు. ఒక్కొక్క ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారని ఇది చట్ట వ్యతిరేకమని ఇకపై ఎవరైనా వాహనానికి సంబంధించిన పేపర్లు లేకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా త్రిబుల్ రైడ్ చేసిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా వాహన దారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు.
ఏ విషయంలోనైనా పోలీసులు మీకు సహకరిస్తారని పోలీసులకు మీరు కూడా సహకరించాలని చట్టబద్ధంగా ఏ పనైనా పోలీసులు చేస్తారని చట్ట వ్యతిరేక పనులు చేస్తే మాత్రం కఠినంగా శిక్షించాల్సి వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి, ఎస్సై రాజేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





