కందుకూరు జనసముద్రం న్యూస్ మార్చి 30
కందుకూరు :నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి కందుకూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ రావు లను పరిచయం చేస్తూ గౌరవ శాసనసభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మానుగుంట మహీదర్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు మానుగుంట అభిమానులు అందరూ ఏకమై పార్లమెంట్ అభ్యర్థి విజయ సాయన్నను, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదనను అత్యధిక మెజార్టీతో గెలిపించి యువ ముఖ్యమంత్రి సంక్షేమ రథసారథి అభివృద్ధి ప్రదాత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహను రెడ్డికి బహుమతి అందించాలని కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. వైయస్సార్ కుటుంబ సభ్యుల మైన మనందరం పార్టీ అభ్యర్థులను గెలిపించి గౌరవ మర్యాదలను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా అండగా ఉన్న అభిమానులు నాయకులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మా కుటుంబానికి తోడునీడగా ఉండి సహకరించిన అందరికీ పాదాభివందనం చేస్తున్నాను అని భావోద్వేగంతో మాట్లాడారు. మన మీద నమ్మకముతో జగనన్న బీసీ సామాజిక వర్గ నేతను మన నియోజకవర్గానికి పంపారు. బుర్ర మధుసూదన్ ను గెలిపించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందాం కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేసి వైసీపీ జెండాను ఎగరేద్దాం అని అన్నారు. విజయ్ సాయి రెడ్డి అన్న లాంటివాడు, బుర్రా మధుసూదన్ తమ్ముడు లాంటివాడు వారి గెలుపు మనకు ప్రతిష్టాత్మకమని ఈ సందర్భంగా తెలిపారు





