జనసముద్రం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా. 30 మార్చి 2024.
రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా అవసరమైన శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఇ.వి.ఎమ్ గోడౌన్ ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా, పటిష్టంగా నిర్వహించేలా ప్రతీ నియోజక వర్గంలో ఈ.వి.ఎమ్, వి.వి ప్యాట్ లపై శిక్షణ అందించనున్నామని అన్నారు. దీని కొరకు నియోజక వర్గ స్థాయిలో ఆరు ఈ.వి.ఎమ్ ల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఈ. వి.ఎమ్ లపై ఎటువంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేసి ఎన్నికలు సాఫీ గా జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ.వి.ఎమ్ ల శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు అందరూ సహకారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
కంట్రోల్ రూమ్ పనితీరు పరిశీలన
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ పనితీరు, నిఘాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వెబ్ కాస్టింగ్ ద్వారా ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద వాహనాల తనిఖీలను పరిశీలించారు. జి.పి. ఎస్. సిస్టం తో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల వాహనాలు ఉన్న ప్రదేశాల పర్యవేక్షణను, ప్రసార మాధ్యమాలు ద్వారా సోషల్ మీడియాలో ప్రసారమౌతున్న కార్యక్రమాల్లో యాడ్ వర్క్ వార్తలపై నిఘా, సి – విజల్ ఫిర్యాదుల నమోదు, తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక,కంట్రోల్ రూం ఇన్ ఛార్జ్ అధికారి,
ఎస్డిసి ఆర్ వి సూర్యనారాయణ, టిడిపి, లోక్ సత్తా, జె ఎస్ పి రాజకీయ పార్టీ ప్రతినిధిలు జి .వెంకట నాయుడు, కె . పాపా రావు, పి.శ్రీనివాస్ రావు, ఇన్చార్జి డి అర్ ఓ జీ.కేశవ నాయుడు, తాసిల్దార్ కె.ఆనందరావు, డిప్యూటీ తాసిల్దార్ వెంకట రమణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వి.రామ కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





