

జనసముద్రం న్యూస్,25ఏప్రిల్,అనంతపురం.
రేపటి రోజున అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగు రైతు సంఘం తరఫున అడ్డుకుంటాం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజున అనంతరం జిల్లా నార్పల మండలానికి వస్తున్నారు ఏ ముఖం పెట్టుకొని జిల్లాకు వస్తున్నావు ముఖ్యమంత్రి గారు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇంతవరకు పంట నష్టపరిహారమే లేదు మీరు గాని మీ మంత్రులు గానీ ఎవరు పంట నష్టం పై స్పందించలేదు. రేపు నువ్వు పర్యటిస్తున్న నార్పల మండలంలో అకాల వర్షాలతో బొప్పాయి అరటి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా జిల్లా పర్యటనకు ఏ విధంగా వస్తావని తెలుగు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను.
కురుగుంట నారాయణస్వామి
రాప్తాడు నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు