
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం జనసముద్రం ప్రతినిధి శ్యాం మార్చి 27
చిన్నంబావి మండల పరిధిలోని దగడపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన తూముకుంట నుండి దగడపల్లి కి బీటీ రోడ్డు నిర్మాణంలో పట్టా భూములు కోల్పోతున్నామని పూర్వం నుండి గ్రామానికి ఆయకట్టు రోడ్డు గా ఉన్న బండ్ల బాటను భూ సర్వే రికార్డు ప్రకారమే కొనసాగాలని పట్టా భూములు కోల్పోతున్న దగడపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతులు ఓడే పద్మమ్మ, ఓడే శివయ్య, ఓడే మల్లయ్య, ఓడే శీను, ఓడే వెంకటేశ్వర్లు పత్రిక ముఖంగా అధికారులను కోరారు.
దగడపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 139 లో గల ఐదు ఎకరాల భూమిని వారి కుటుంబానికి చెందిన సొంత పట్టా భూమిలో భూ సర్వే నక్స టిఫన్ ప్రకారం రోడ్డు నిర్మించకుండా కొందరు ఇష్టానుసారం రైతుల పట్టా భూముల్లో నూతన రోడ్లు నిర్మిస్తున్నారని దీంతో రైతులకు ఎంతో నష్టాన్ని చేకూరుస్తుందని గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం నక్స బాటను రోడ్డుగా పరిగణించి బీటీ రోడ్డును నిర్మించాలని వారు కోరారు.
గతంలో ఆయకట్టు రోడ్డు అంటూ వారికి చెందిన 139 సర్వేనెంబర్ లో గల ఒక్కొకరికి 1.00 ఎకరా పట్టా భూమి మొత్తం ఐదు మంది కి కలిపి ఐదు ఎకరాల భూమిలో మట్టి రోడ్డు నిర్మించడానికి రాగా వ్యతిరేకించడం జరిగిందని మళ్లీ నేడు బీటీ రోడ్ నిర్మాణానికి మొత్తం ఎకరా భూమిని కోల్పోతున్నామని ఇది రెవెన్యూ అధికారులు మరియు ఆర్ అండ్ బి అధికారులు గుర్తించి గ్రామంలో మరికొంతమంది రైతులకు కూడా అన్యాయం జరగకుండా చూడాలని వారు కోరారు. ఇటీవల నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి 4 కోట్ల 50 లక్షలు విడుదల కావడంతో గ్రామంలోని రైతులు ముక్తకంఠంగా నక్స ప్రకారమే రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టా భూములు కోల్పోతున్న రైతులను సైతం ప్రభుత్వం పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.





