జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 25:
నిడమనూరు మండలం పట్టణ ప్రజలకు,పరిసర గ్రామ ప్రజలకు, మిర్యాలగూడ డిపో మేనేజర్ “బొల్లెద్దు పాల్ ” తెలుపుతూ.. సోమవారము నిడమనూరు బస్టాండ్ నందు ఉదయం 10:00గం, నుండి సాయంత్రం 4.00గం వరకు వికలాంగుల బస్ పాస్ లు జారీ చేయబడునని మార్చి 25న ప్రకటన ద్వారా తెలపడం జరిగింది.
దివ్యాంగులు బస్సు పాస్ లు పొందుటకు కావలసినవి..
ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు సర్వీస్ ఛార్జ్ నిమిత్తం 50 రూపాయలు వసూలు చేయబడును. ఈ క్యాంపు మేళా ని ప్రతి దివ్యాంగుడు… వినియోగించుకొని బస్సు పాస్ పొందగలరని మిర్యాలగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్ తెలియజేశారు.
ఈ విషయం గురించి 9502502357, 9640239896 ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు.





