
జనసముద్ర న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, మణుగూరు, మార్చి 21.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక నియోజకవర్గం ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగ కాంతారావు శోభకృతు నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు, శ్రేయోభిలాషులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు సుఖ సంతోషాలతో పాడిపంటలతో వర్ధిల్లాలని నూతన సంవత్సరంలో ప్రజల కష్టాలు బాధలు తొలగిపోయి ఇంటిల్లిపాది ఆనందంగా గడపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు, ప్రతి సంవత్సరం స్వర్ణ యుగం లాగా మారిందని కెసిఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు అర్హులైన వ్యక్తులకు సంక్షేమ పథకాలను చేరువయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వాటికి అనుగుణంగా అధికారులు చక్కటి కృషి చేస్తున్నారని అన్నారు. నిజమైన లబ్ధిదారుడికి న్యాయం జరిగే విధంగా అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తద్వారా ప్రజల్లో అసమానతలు రూపుమాపి సమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుందని దీనికై ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.





