
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, ఫిబ్రవరి 25.
పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం జడ్పీ హెచ్ ఎస్, యుపిఎస్ పోతిరెడ్డిపల్లి ప్రధానోపాధ్యాయులు మువ్వ వెంకటేశ్వరరావు, భూక్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ సెలక్ట్ చేసిన పిటిఎం పాఠశాలల్లో భాగంగా పినపాక మండలం నుండి రెండు పాఠశాలలు ఎన్నికవ్వటం గర్వకారణం అని తెలియజేశారు.10వ తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఉపాధ్యాయులకు 6 మంది విద్యార్థులను దత్తత ఇచ్చామని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు సరైన వాతావరణం కల్పించి సహకరించాలని, విద్యా ప్రమాణాలను గురించి సన్నద్ధం చేసే దానిలో భాగస్వాములు కావాలని, ప్రతి విద్యార్థి కూడా వేకువ జామున లేపి చదివించాలని,విద్యార్థుల ఆరోగ్యo పట్ల శ్రద్ధ చూపించాలని, విద్యార్థులకు చదువు పట్ల ఎటువంటి సందేహాలు ఉన్న సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఏ సమయంలోనైనా ఫోను ద్వారా సందేహాలను నివృతి చేసుకోవచ్చని రాబోయే రెండు నెలలు విద్యార్థులకు చాలా ముఖ్యమని, ఏ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు గైర్హాజరు కాకుండా సహకరించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు.వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు చేయవలసిన సలహాలు, సూచనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఎంసి చైర్మన్ వాగబోయిన వెంకటరమణ, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.





