
ఆస్పత్రిలో మరిన్ని సేవలు మెరుగుపరుచలి
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :23
తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం రోజున తూప్రాన్ మున్సిపల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు, తనిఖీల్లో భాగంగా రోగులతో మాట్లాడరు , ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించాలని గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ ల పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తు వారికీ అవసరమైన వైద్య చికిత్స చేయాలని, తప్పని పరిస్థితిలో మాత్రమే ఆపరేషన్ చేయాలని వైద్యులకు సూచించారు , ఆస్పత్రుల్లో 24 గంటలు వైద్యులు సేవలు అందించాలని, ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు, అనంతరం ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ అమర్ సింగ్ తో మాట్లాడినకలెక్టర్ ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీలకు అన్ని రకాల టెస్టులు, స్కానింగ్ లు, ఆసుపత్రిలోనే జరగాలని ఆస్పత్రులు మరిన్ని సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు, ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనం కలెక్టర్ ప్రతిమ సింగ్, ఆర్డీవో శ్యాం ప్రకాష్, గజ్వేల్ ఓఎస్డి ముత్యం రెడ్డి, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ అమర్ సింగ్, పలు శాఖ అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





