
జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 08, కొయ్యాలగూడెం మండల రిపోర్టర్,ఈ.మనోహర్,
మాజీమంత్రి, టిడిపి బిసి సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన * బీసీ సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సుభానీ కొల్లు రవీంద్ర అరెస్టుపై స్పందించారు ప్రభుత్వం చేసే అరాచకాలు, తప్పిదాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు… ఈ అక్రమ అరెస్టులతో భవిష్యత్తులో వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని షేక్ సుభానీ అన్నారు. కోట్లాది రూపాయల ఖరీదు చేసే స్థలాన్ని వారి పార్టీ ఆఫీసు కోసం ప్రభుత్వ స్థలాన్ని కజ్జా చేయడం ఎంతవరకు సమంజసమని, ప్రజలు ఇది గమనిస్తున్నారని త్వరలోనే మీకు తగిన బుద్ధి చెప్తారని సుభానీ హెచ్చరించారు. ప్రభుత్వం అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే మాజీ మంత్రి, బీసీ నేత కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టు అని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి, తెదేపా నేతలను అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రోజురోజుకూ జగన్ రెడ్డిపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను, ఆయన చేసే కుళ్ళు రాజకీయాలపై ఆయన ధ్వజమెత్తారు. ఈ అరెస్టు ప్రభుత్వ తప్పిదాలను, అక్రమాలను బిసి నాయకులు ఖండిస్తున్నారని, ఆయనను వెంటనే బేషరతుగా విడుదల చెయ్యకపోతే మూల్యం చెలించుకోక తప్పదని అయన హెచ్చరించారు. వైసిపి ప్రభుత్వ తప్పిదాలను పక్కదారి పట్టించేందుకే ఈ చర్యలు అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న నేత కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమ అరెస్టులపై షేక్ సుభానీ మండిపడ్డారు.





