
- కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి…
- మీపై ఆధారపడ్డ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి…..
- మెదక్ కలెక్టర్ రాజర్షి షా….
మెదక్ జిల్లా, ప్రతినిధి (జనసముద్రం న్యూస్) ఫిబ్రవరి: 6
మీ భవిష్యత్తు కోసం, తల్లిదండ్రుల కోసం, మీ పై ఆధారపడ్డ వారి కోసం ఉన్నత ఉద్యోగ సాధనే లక్ష్యం కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హితవు చెప్పారు. టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ 2,3,4 ఉద్యోగాలకు ఎస్సి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మూడు మాసాల పాటు ఎస్సి అభ్యర్థులకు ఇచ్చే ఉచిత శిక్షణ ఫౌండేషన్ ప్రారంభించిన అనంతరం జ్యోతిని వెలిగించి, అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జులై లో జరిగే పోటీ పరీక్షలకు సమయం తక్కువగా ఉన్నందున టి.వి. సినిమా, చరవాణిలకు దూరంగా ఉండి ఈ నాలుగున్నర మాసాలు కష్టపడి చదవాలి.. చదువుతూనే ఉండాలని అన్నారు. ముందుగా సిలబస్ ఏముందో చూసుకొని, ఎలా చదవాలో మదిలో ఒక అవగాహనకు రావాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతామన్నారు.ఉన్నత ఉద్యోగమే లక్ష్య సాధనగా అభిరుచి, కోరిక మేరకు స్టడీ సర్కిల్ ఇచ్చే మెటీరియల్ తో పాటు ఆన్ లైన్ ద్వారా వివిధ పుస్తకాలను అధ్యయనం చేయాలని, చదువుతో పాటు క్లుప్తంగా నోట్స్ సిద్ధం చేసుకోవాలని, కంబైన్డ్ స్టడీ చేయాలని సూచించారు. మెంటల్ అబిలిటీ , కరంట్ అవైర్స్ పై అవగాహన పెంపొందించుకోవాలని, గత పి ఎస్ సి పరీక్షల పేపర్లను తిరగేసి క్వక్షన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందొ అర్థం చేసుకోవాలని అన్నారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీ చే వంద మంది అభ్యర్థులకు మూడు మాసాల పాటు శిక్షణతో పాటు 1500 రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్ ఇస్తూ ఒక్కో అభ్యర్థికి 6,750 ల చొప్పున ప్రభుత్వం స్టైపండ్ ఇస్తుందని, ఇట్టి చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ప్రోగ్రాం డైరెక్టర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.






