
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి
ఫిబ్రవరి 04
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో
మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నగరాల నుండి కీసరగుట్ట ప్రత్యేక నడపడం జరుగుతుందని సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న విలేకరుల సమావేశంలో తెలిపారు శనివారం కుషాయిగూడ డిపోలో విలేకరుల సమావేశం ఏర్పాటు రీజినల్ మేనేజర్ వెంకన్న మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా 14 ఫిబ్రవరి 21 వరకు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని తెలిపారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఉన్న శైవ క్షేత్రం మహాశివరాత్రి పండుగ సందర్భంగా హైదరాబాద్ ఇతర జిల్లా నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని దీనిలో దీనిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు
శివరాత్రి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కల్పించే విషయంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజయవంతం చేయాలని సమావేశంలో వెంకన్న తెలిపారు
ఈ ప్రత్యేక బస్సులు అఫ్జల్గంజ్ నుండి కీసర గుట్టకు సికింద్రాబాద్ బ్లూ సి హోటల్ నుండి కీసర గుట్టకు ఉప్పల్ ఘట్కేసర్ నుండి కీసరగుట్టకు అందుబాటులో ఉంటాయని తెలిపారు శివరాత్రి సందర్భంగా పండుగ రోజు 24 గంటలు బస్సులు అందరు బాటలో ఉంటాయని కుషాయిగూడ డిపో మేనేజర్ పి చంద్రకాంత్ తెలిపారు

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్.ఎం అపర్ణ కళ్యాణి, కుషాయిగూడ డిపో మేనేజర్ చంద్రకాంత్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీపతి కృష్ణ, హకీంపేట డి.ఎం బహభూతి, చెంగిచర్ల డి.ఎం శ్రీ నల్ల ఏసు, కంటోన్మెంట్ డి.ఎం. ఎల్.రాంమోహన్తో పాటు తదితర సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.





