
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి :30
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా యెస్.పి .రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలుసూచనలు చేయడం అయినది. ఈ కార్యక్రమంలో కొంపల్లి చెందిన నాగోల్ వినీల నిజాంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామ శివారులో 3 ఎకరాల 37 1/2 ఎకరాల పట్టా భూమిని అదే గ్రామానికి చెందిన లలిత,శిల్పలత ల వద్ద 2022 లో కొన్నామని అట్టి భూమిని సర్వే చెపితే 28 1/2 గంటల భూమి తక్కువా ఉన్నదని ఇట్టి విషయాన్ని
వారిని అడిగితే నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో మేము డబ్బుల ఇవ్వము భూమి ఇవ్వమని మమ్మల్ని నమ్మక ద్రోహం చేసినారని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట సి. ఐ గారికి సూచనలు చేయటం జరిగింది. అలాగే కోల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కృష్ణ తన భార్య డిసెంబర్ నెలలో పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని తనకి ఇద్దరు పిల్లలు అని తన కొడుకు తన దగ్గర ఉన్నాడని తన భార్య బిడ్డను తీసుకుని వెళ్లిందని తనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని కొల్చరం ఎస్.ఐ గారికి సూచనలు చేయటం జరిగింది. ఈ రోజు జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాది దారులు రావడం జరిగినది.





