
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 29:
తెలుగు నూతన సంవత్సరం ఉగాది నాటికి మిర్యాలగూడ నియోజకవర్గమును నూతన జిల్లాగా ప్రకటించాలని మిర్యాల గూడ మాజీ శాసనసభ్యులు రేపాల శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం స్థానిక అమరవీరల స్తూపం వద్ద పలువురు మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమకారులతో మాట్లాడుతూ..
జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని “అర్హతలు “అవకాశాలు మిర్యాలగూడకు ఉన్నాయన్నారు. జిల్లా ఏర్పాటు ఆకాంక్ష ప్రజలందరిలో బలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లా ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు.మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు సీఎం కేసీఆర్ కు తెలిపి రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఉగాదిలోపు జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం స్పందించకపోతే కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు,ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొనాలని సూచించారు. అనంతరం కరాటే విద్యార్థులతో జిల్లా ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా ఏర్పాటు ఆవశ్యకత వివరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రేపాల శ్రీనివాస్ తో పాటు జిల్లా సాధన సమితి నాయకులు.. చేగొండి మురళి యాదవ్,దాసరాజు,జయరాజు, కరాటే మాస్టర్ రమేష్,మనోజ్, వేణుగోపాల్ రెడ్డి,సోమయ్య, రామయ్య ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని మిర్యాలగూడను నూతన జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.





