
జనసముద్రం న్యూస్ జనవరి 26: డిండి గుండ్లపల్లి ప్రతినిధి:(కాసుల ఐలేష్ చారి)
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని పవర్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్& వెల్డర్స్ యూనియన్ భవనము నందు సభ్యుల ఆధ్వర్యంలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను యూనియన్ అధ్యక్షుడు మక్తర్ పతాకావిష్కరణ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని తెలియజేశారు నూతన సభ్యులకు లేబర్ కార్డులను ఇప్పించి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వినియోగించుకునే విధంగా చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కాసుల ఐలేష్ చారి,కంపిలి రమేష్ సభ్యులు ఎస్కే అన్వర్,ఎండి నిరంజన్, ఎస్.శ్రీనివాసులు,బి.నిరంజన్,మల్లేష్ రజినీకాంత్,గోపాల్,ప్రశాంత్,చాంద్ పాషా,హనుమంతు,ఎం. శ్రీనివాసులు,సోహెబ్,సోహెల్,ఏం. రమేష్,కే.వెంకటేష్,సైదులు,రమేష్, తదితరులు పాల్గొన్నారు.





