
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 17:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం ను ప్రారంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కంటి చూపు తక్కువగా ఉన్న వృద్ధుల “పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్” కంటి చూపు కనబడుటకు కళ్లద్దాలు, నేత్ర వైద్యం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అందిస్తూ న్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ను మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ధీరావత్ నందిని రవితేజ ఆధ్వర్యంలో దామరచర్ల మండలంలో మండల ప్రత్యేక అధికారి కె. నాగమణి అధ్యక్షతన నిర్వహించబడుతుంది.

ఇందులో భాగంగా మండల తహశీల్దార్ కార్యాలయం దామరచర్ల యందు కంటి వెలుగు కార్యక్రమము విషయమై ప్రభుత్వ ఆదేశానుసారం మరియు నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో కంటి వెలుగు కార్యక్రమం గురించి వివరించిన సూచనల ప్రకారం దామరచర్ల మండలములో 2023 జనవరి 18 నుండి నిర్వహించు ‘కంటి వెలుగు’ కార్యక్రమములో భాగంగా రెండు టీం ల ద్వారా నిర్వహించుచున్నందున మొదటగా కంటి వెలుగు కార్యక్రమము ను 2023 జనవరి 19న దామచర్ల మండలంలోని గ్రామ పంచాయతీ బాలాజీనగర్ తండ, బెట్టేతండ యందు ప్రారoభిoచబడుచున్నదని ఇదేవిధంగా దిగువ షెడ్యుల్ ప్రకారం మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ‘కంటి వెలుగు’ శిబిరాలు ఏర్పాటు చేయబడతాయని రెండో విడత కంటి వెలుగు కార్యక్రమము ను విజయవంతం చేయవలసినదిగా మండల ప్రజా ప్రతినిధులకు, ప్రజలందరికీ మండల ప్రత్యేక అధికారి కే.నాగమణి రెండో విడత ‘కంటి వెలుగు’ సమావేశంలో తెలిపారు.
ఈ సమావేశములో ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, మండల తహశీల్దార్ ఖాదర్, మెడికల్ అధికారులు,
మండల అధికారులు, వెద్య సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు.





