అవంతిపురం, కొత్త కాలనీ గ్రామవాసుల సమస్యలను అధికార బృందంతో కలిసి పరిశీలించిన మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి గార్లపాటి జ్యోతిలక్ష్మి

Spread the love

జన సముద్రం న్యూస్, అవంతిపురం, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 12:

కాలనీవాసులు పడుతున్న కష్టాలు చెప్పుకోలేనివి. కొత్త కాలనీవాసుల సమస్యల గురించి తెలుసు కోవడానికి మిర్యాలగూడ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి గార్లపాటి జ్యోతిలక్ష్మి మండల అధికార బృందంతో పరిశీలించడానికి విచ్చేశారు.

కొత్త కాలనీ గ్రామ నివాస ప్రజలు ఎంపీడీవో “గార్లపాటి జ్యోతిలక్ష్మి”కి తమ సమస్యలను గురించి మాట్లాడుతూ..
కొత్త కాలనీ గ్రామవాసులు మాకు సొంత ఇల్లు లేవని, పూరి గుడిసెలలో నివాసం ఉంటున్నామని, మేము రాత్రిపూట నిద్రించు సమయంలో సర్పములు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, సర్ప కాటు వల్ల కొంతమంది మరణించారని ఎంపీడీవో జ్యోతిలక్ష్మికి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఇంతే కాకుండా మాకు త్రాగునీటి సౌకర్యం అంతంత మాత్రమేనని, డ్రైనేజీ, వీధిలైట్లు, రోడ్డు సమస్య లతో ఇబ్బంది పడుతున్నామని, కొన్నిసార్లు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని, మేము “ఆకలి ద ప్పులతో” జీవనం సాగిస్తున్నామని ఇంకా మరెన్నో విషయాలు ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మికి కొత్త కాలని గ్రామం వాసులు తమ సమస్యలను తెలియజేశారు. కొత్త కాలనీ గ్రామవాసుల సమస్యలను తెలుసుకున్న మిర్యాలగూడ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి గార్లపాటి జ్యోతిలక్ష్మి స్పందించి మీ సమస్యలను మండలం ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి కి తెలియజేసి,ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి కొత్త కాలనీ గ్రామవాసుల సమస్యలు పరిష్కారమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని గ్రామ వాసులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి జ్యోతిలక్ష్మితోపాటు మండల ప్రజా పరిషత్ అధికార బృందం, కొత్త కాలనీ గ్రామవాసులు, పలు పార్టీ నాయకులు పాల్గొన్నారు

  • Related Posts

    సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరం

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61…

    తీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం