శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో కర్ణాటక ఎమ్మెల్యే, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నా ఎమ్మెల్యే కృష్ణప్ప

Spread the love

జనసముద్రం న్యూస్,శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్,:జనవరి,12:

అమడగూరు న్యూస్: మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర హళ్లి క్షేత్ర “ఎమ్మెల్యే కృష్ణప్ప” గురువారం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి కుటుంబ సమేతంగా అందరూ కలిసి ప్రత్యేక పూజలు,అభిషేకాలు,అర్చనలు,నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే కృష్ణప్ప మాట్లాడుతూ…మా ఇంటి దేవత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆశీస్సులతోనే నేడు నేను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు.భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందడానికి అమ్మవారి ఆశీస్సులతోనే ముందుకెళ్తానని అన్నారు.అంతేగాక ప్రజలకు నిరంతరం వారి సమస్యల కోసం పాటుపడతానని ఆయన తెలిపారు.కర్ణాటకలో “ముఖ్యమంత్రి బసవరాజు బోమ్మై” బాగా పనిచేస్తున్నారని వచ్చే ఎన్నికలల్లో కూడా కచ్చితంగా బిజెపి గెలుస్తుందని దిమ్మ వ్యక్తం చేశారు.అలాగే కేంద్ర మంత్రి వర్గంలో అమ్మవారి ఆశీస్సులతో తనకి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం కర్ణాటక రాజ్య ఒక్కలగిరి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలిపారు.అలాగే ఏపీ రాజకీయాలపై ఆరా తీశారు.ఆలయంలో వర్షాల వల్ల నీళ్లు నిలువ ఉంటున్నాయని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన ఆలయంలో నీళ్లు ఊరకుండా శాశ్వత పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అంతేకాకుండా కళ్యాణమండపం వసతి గదులు,పార్కింగ్,ప్రహరీ గోడ పనులు చేయడానికి తన సహకారం అందిస్తానన్నట్లు ఆయన తెలియజేశారు.కావున పనులను వేగవంతంగా చేయాలని ఆయన సూచించారు.అనంతరం మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…కర్ణాటక ఎమ్మెల్యే కృష్ణప్ప అన్న చొరవతో అమ్మవారి ఆలయం దిన దిన అభివృద్ధి చెందుతుందని వారే లేకుంటే అమడగూరు మండలం అనేది ఎవరికి తెలియదని అంతేకాకుండా అమడగూరు మండల వాసులకు నిత్య అన్నదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే కృష్ణప్ప మరియు కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు కలిగి రాజకీయంగా మరిన్ని పదవులు అలంకరించి మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మంజునాథ్,శీనప్ప,మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,ఆలయ ధర్మకర్త లక్ష్మప్ప స్వామి,కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి,లక్ష్మీనారాయణ,రఘు,నరసింహమూర్తి,సప్లయర్ రమేష్,బిజెపి జిల్లా అధ్యక్షులు సుబ్బిరెడ్డి,రామంజులు నాయుడు,కర్ణాటక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం