జన సముద్రం న్యూస్, మెదక్ జిల్లా, ప్రతినిధి, జనవరి 10:

మెదక్ జిల్లా జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని మెదక్ జిల్లా చిలిప్చేడ్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఎస్.ఐ. గౌస్ ఎస్పీ గారికి వివరించారు. అనంతరం ఎస్పీ అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా వుంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పని చేస్తూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని పోలీసులకు సూచించారు, ఆన్ లైన్ వినియోగించు విధానము పై అందరికి అవగాహన ఉండాలని, టీఎస్ సి ఓ పి ఎస్ ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయడం మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదని సూచించారు. సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి పెండింగ్ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అలాగే జిల్లా ఎస్.పి.గారితో పాటు ఎంపీపీ వినోద దుర్గా రెడ్డి ,సర్పంచ్ లక్ష్మీ దుర్గా రెడ్డి ,సర్వేయర్ రవి ప్రసాద్ గారు చిలిప్చేడ్ నూతన పోలీస్ స్టేషన్ కోసం శీలంపల్లి ఎక్స్ రోడ్ వద్ద స్థల పరిశీలన చేశారు.






