వచ్చే ఎన్నికల్లో పోలీస్ నేతలను పక్కన పెట్టనున్న సీఎం జగన్..గోరంట్ల మాధవ్ కు రాజ్యసభ సీటు..??

Spread the love

జనసముద్రం న్యూస్,జనవరి 11:

గత ఎన్నికల్లో పోలీసు విభాగం నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు వైసీపీ టికెట్ ఇచ్చింది. వీరిలో ఒక్కరు మాత్రమే విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈయన కూడా పార్టీకి మచ్చతెచ్చే పనిచేశారు. అయితే.. పార్టీకి బీసీలు అవసరం కాబట్టి.. వారిలో ఎలాంటి వ్యతిరేకత రాకూడదనే వ్యూహంతో ఆయనను పార్టీ నుంచి పంపించలేక.. మౌనంగా భరిస్తున్నారనే వాదన పార్టీలో వినిపిస్తోంది.

అయితే.. వచ్చే ఎన్నికల్లో మాత్రం పోలీసు విభాగం నుంచి వచ్చిన రావాలని అనుకుంటున్న వారికి కూడా టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. వారి విషయంలో ప్రజలుసానుకూలంగా లేరని అందుతున్న రిపోర్టులే కారణమని అంటున్నారు. ఉదాహరణకు గుంటూరు వెస్ట్ నుంచి గత ఎన్నికల్లో మాజీ పోలీసు అధికారికి చంద్రగిరి ఏసురత్నానికి టికెట్ ఇచ్చారు. ఈయన ఓడిపోయారు.వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన గ్రాఫ్ను పరిశీలించిన వైసీపీ వద్దని చెప్పేందుకు రెడీ అవుతోంది. ప్రజల్లో ఇమేజ్ పెరగకపోగా.. ఆయన  వైఖరి పార్టీలో నేతలకు నచ్చడం లేదని టాక్. దీంతో ఏసురత్నాన్ని.. మళ్లీ చైర్మన్గా చేయడమే ఉత్తమమని తెలుస్తోంది. ప్రస్తుత పదవి వచ్చే ఏడాదితో ముగియనుంది.

హిందూపురం అసెంబ్లీ నుంచి మాజీ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ను నిలబెట్టారు. ఈయన కూడా ఓడిపోయారు. ఇప్పుడు మరింత వివాదం అవుతున్నారు. సొంత పార్టీ నాయకులు.. ఆయనను తప్ప ఎవరిని నిలబెట్టినా.. గెలిపిస్తామని చెబుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం.. ఆయనను కూడా వద్దని చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అదేవిధంగా హిందూపురం ఎంపీగా ఉన్న మాజీ సీఐ గోరంట్ల మాధవ్ను ఈ సారి పోటీ నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఆయనను రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మాధవ్ కూడా దీనికి అంగీకరించినట్టు సమాచారం.

Related Posts

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

Spread the love

Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం