జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,జనవరి9:

కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల తో పాటు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విజ్ఞప్తి చేశారు.
సోమవారం ఆమె కాలుష్య నియంత్రణలో భాగంగా జీవీఎంసీ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి సోమవారం ప్రజా రవాణా అయిన ఏపీఎస్ఆర్టీసీలో తమ క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని స్పందన, డయల్ యువర్ మేయర్ కార్యక్రమం తో పాటు ఇతర కార్యక్రమంలో ముగించుకొని ప్రజా రవాణాలో తమ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఇప్పటికే నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని, నియంత్రణకు నగర ప్రజలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల యాజమాన్యం విద్యా సంస్థలు వ్యాపార సంస్థ నా ఉద్యోగులు సహకరించి వారంలో ఒక్కరోజు ప్రజా రవాణా అనే ఉపయోగించినట్లయితే కొంతవరకు కాలుష్యాన్ని నియంత్రించగలుగుతామని తెలిపారు.





