

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11:
.ఈరోజు ప్రైమ్ నైన్ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక తాడేపల్లిగూడెం రిపోర్టర్ రావూరి చెన్నకేశవ మరణించారు. యాజమాన్యం యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల, వడ్డీకి తెచ్చి అడ్వాన్స్ చెల్లించటం, టార్గెట్లు ఎక్కువగా పెంచడం, అడ్వాన్స్ మళ్లీ తెమ్మని ఒత్తిడి చేయడం వల్ల చెన్నకేశవ పొద్దుటి నుండి యాడ్లు కోసం తిరిగి తిరిగి తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చి పడిపోయి మరణించాడు .యాజమాన్యాల జీతాల ఇవ్వక ,యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల అనేకమంది విలేకరులు గతంలో మరణించారు. రెండు సంవత్సరాల క్రితం రాజమండ్రి స్టాఫ్ రిపోర్టర్ జుట్ట గణపతి యాజమాన్యాల ఒత్తిడి తో అప్పులు చేసి ,యాడ్స్ బిల్లులు చెల్లించి ,కుటుంబాన్ని పోషించ లే క .అప్పులు తీర్చలేని పరిస్థితిలో కరోనా వచ్చి మరణించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు చదువులు పూర్తవక తల్లి కుటుంబాన్ని పోషించలేక అప్పులు తీర్చలేక బాధపడుతున్నారు. ప్రభుత్వం కరోనాతో మరణించిన వారికి ఐదు లక్షల ఇస్తానని జీవో తెచ్చి, అమలు చేయడం లేదు. ప్రభుత్వం ఇప్పుడు అయినా కరోనాతో మరణించిన వారికి ఐదు లక్షలు ఇప్పించాలని కోరుతున్నారు.