ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Spread the love

బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించ్చిన కురుబ కుటుంబ సభ్యులు.

జనసముద్రం న్యూస్:నవంబర్ 26,శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్:

పుట్టపర్తి న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా,పుట్టపర్తి నియోజకవర్గం సాయి ఆరామం నందు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కురువ కుటుంబ సభ్యులు అలాగే సవితమ్మ మాట్లాడుతూ…భారతావనికి ఎందరో మహాత్ములు,గొప్ప వ్యక్తుల త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది.అదేవిధంగా దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం పుట్టిన నవంబర్‌ 26ని గుర్తు పెట్టుకోవాలని 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్‌.ఎమ్‌.సింఘ్వికి ఆలోచన వచ్చింది.అదే రోజును న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు.అయితే,భారత ప్రభుత్వం 2015లో అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి,ఆ సంవత్సరం నవంబరు 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది.అప్పటి నుంచి నవంబర్‌ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా,రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని రాజ్యాంగ సభ,డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్ సారధిగా కమిటీ ఏర్పాటైందని,రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు.కమిటీలోని ఆరుగురు సభ్యులు మేథోమధనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు.1947 నవంబర్‌ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సామకోటి ఆదినారాయణ,మల్లికార్జున,రామాంజినేయులు,నాగేంద్ర,ఏ ప్రసాద్,చెన్నప్పా,శివానంద,కమ్మన్న,అంగడి ప్రభాకర్,పైపల్లి చంద్రశేఖర్,గోరంట్ల కిష్టప్ప,నారాయణస్వామి,రమేష్,కేశినేని ఆదినారాయణ,గొరంట్లపల్లి శ్రీనివాసులు తదితరులు కురుబ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం