ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Spread the love

బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించ్చిన కురుబ కుటుంబ సభ్యులు.

జనసముద్రం న్యూస్:నవంబర్ 26,శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్:

పుట్టపర్తి న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా,పుట్టపర్తి నియోజకవర్గం సాయి ఆరామం నందు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కురువ కుటుంబ సభ్యులు అలాగే సవితమ్మ మాట్లాడుతూ…భారతావనికి ఎందరో మహాత్ములు,గొప్ప వ్యక్తుల త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది.అదేవిధంగా దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం పుట్టిన నవంబర్‌ 26ని గుర్తు పెట్టుకోవాలని 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్‌.ఎమ్‌.సింఘ్వికి ఆలోచన వచ్చింది.అదే రోజును న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు.అయితే,భారత ప్రభుత్వం 2015లో అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి,ఆ సంవత్సరం నవంబరు 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది.అప్పటి నుంచి నవంబర్‌ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా,రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని రాజ్యాంగ సభ,డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్ సారధిగా కమిటీ ఏర్పాటైందని,రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు.కమిటీలోని ఆరుగురు సభ్యులు మేథోమధనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు.1947 నవంబర్‌ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సామకోటి ఆదినారాయణ,మల్లికార్జున,రామాంజినేయులు,నాగేంద్ర,ఏ ప్రసాద్,చెన్నప్పా,శివానంద,కమ్మన్న,అంగడి ప్రభాకర్,పైపల్లి చంద్రశేఖర్,గోరంట్ల కిష్టప్ప,నారాయణస్వామి,రమేష్,కేశినేని ఆదినారాయణ,గొరంట్లపల్లి శ్రీనివాసులు తదితరులు కురుబ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!