2023 ఎన్నికల టికెట్లపై కెసిఆర్ కసరత్తు షురూ..!

Spread the love

ముచ్చటగా మూడోసారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో గులాబీ బాస్ తన చేతిలోని అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ షురూ చేశారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటి నుంచే సర్వేలు చేస్తున్నారు.  ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు నేతల పనితీరు పార్టీ పరిస్థితి ఆధారంగా నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించారు. సర్వేల ఆధారంగా ఖచ్చితంగా  గెలిచే ట్రాయంగిల్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలను గుర్తించి మూడు కేటగిరీలుగా పరిగణించారు. ఖచ్చితంగా గెలిచే కేటగిరి ఏలో 38 నుంచి 44 కాంగ్రెస్ బలంగా ఉండి కాస్త కష్టపడితే గెలిచే బి కేటాగిరిలో 30-35 నియోజకవర్గాలను గుర్తించారు.
ఇక ట్రాయాంగిల్ ఫైట్ లో బీజేపీ కాంగ్రెస్ లతో పోరాడి వీక్ గా ఉన్న నియోజకవర్గాలను డేంజర్ జోన్ ‘సీ’గా కేసీఆర్ విభజించినట్టు తెలుస్తోంది. ఈ ‘సీ’ కేటగిరీ సీట్లలో ఏకంగా టీఆర్ఎస్ మంత్రులు కూడా ఉన్నారని.. వారి గెలుపు అసాధ్యం అని తెలిసి కొత్త వారికి టికెట్ ఇచ్చే యోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.ఈ సీ కేటగిరీ డేంజర్ జోన్ మంత్రులతో సహా 10 మందితో కూడిన జాబితా కేసీఆర్ కు అందిందని.. ఇక్కడ గెలుపు కోసం వేరే వ్యక్తులను ప్రచారం కోసం కేసీఆర్ బ్యాచ్ లు సిద్ధం చేస్తారని అంటున్నారు. మిగతా ఇన్ చార్జీలకు కూడా కేటగిరీల వారీగా ఇన్ చార్జీలను నియమిస్తారని చెబుతున్నారు.
మునుగోడులో గెలిచినా అంత ఖర్చు పెట్టి కేవలం 10వేల ఓట్ల తేడాతో గెలవడాన్ని కేసీఆర్ ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. బీజేపీ ఇంతలా ఓట్లు సాధించడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదు. ఈ క్రమంలోనే అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పరిస్థితిపై ఆరాతీసిన కేసీఆర్.. ఇప్పటి నుంచే పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో నివేదికలు సిద్ధం చేసిన కేసీఆర్.. మొత్తం 119 నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించారు. వాటిలో ఖచ్చితంగా విజయం సాధించేవి 40 ఉండగా.. కొంచెం కష్టపడితే గెలిచే నియోజకవర్గాలు 30-35 వరకూ ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు వీక్ గా ఉన్నట్టు నివేదికలు అందాయి.బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. విజయం కోసం ఆ నియోజకవర్గాల్లో బలమైన నేతలను.. ఇక మంత్రులు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. త్వరలోనే ఇన్ చార్జీలను నియమించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. 

  • Related Posts

    సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరం

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61…

    తీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం