కొడుకు ఆరోగ్యం కోసం కూతుర్ని గొంతుకోసి చంపిన తల్లి.!

Spread the love

ఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నా.. అందరూ సమానమే. పెద్ద కొడుకు అనే మమకారం.. చిన్న కొడుకు అనే వెటకారం.. ఏ తల్లికీ ఉండదు. ఇక ఆడ పిల్లలైనా అంతే. తల్లికి పిల్లలే ప్రపంచం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన పిల్లలకు ఏ చిన్న దెబ్బ తగిలినా.. తల్లి విలవిల్లాడుతుంది. అందుకే అమ్మనుమించిన దైవం లేదని అంటారు. అమ్మ ఈ సృష్టిలో ఎక్కడైనా అమ్మే! కానీ ఓ తల్లి మాత్రం.. తన కొడుకు కోసం.. తన కూతురినే బలి ఇచ్చిందంటే.. నమ్మలేం. కానీ ఇది జరిగింది. మన దేశంలోనే రాజస్థాన్లో చోటు చేసుకుంది. మరి ఆ అమ్మ తెలియక చేసిందా?  తెలిసి చేసిందా?  తెలియదు కానీ మొత్తానికి ఘోరానికైతే పాల్పడి.. తన కడుపునకు తనే చిచ్చు పెట్టుకుని జైలుపాలైంది.

మూఢ నమ్మకంతో ఓ తల్లి.. కొడుకు కోసం కూతురిని చంపుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన కొడుకు ఎవరినైనా బలి ఇస్తే ఆరోగ్యంగా ఉంటాడని ఎవరో చెప్పగా విన్న ఆ తల్లి.. ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది.  మూఢ నమ్మకాలతో తన 12 సంవత్సరాల కూతురిని గొంతుకోసి చంపింది ఓ తల్లి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన 16 ఏళ్ల కొడుకు కోసం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిపింది.
రాజస్థాన్లోని బారాన్ జిల్లా అంట ప్రాంతంలో రేఖ హదా అనే మహిళ తన 16 ఏళ్ల కొడుకు నికేంద్ర సింగ్ను ఎంతో ప్రేమగా చూసుకునేంది. అతడికి గుండెలో రంధ్రం ఉంది. మానసిక స్థితి కూడా బాగుండేది కాదు. అతడి ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతున్న ఆమె ఎవరినైనా బలి ఇస్తే పెద్ద కొడుకు ఆరోగ్యంగా ఉంటాడని ఎవరో చెప్పగా నమ్మింది. దాంతో ఈ హత్యకు పాల్పడింది.ఈ మూఢ నమ్మకంతోనే ఆ మహిళ శనివారం తన కూతురు సంజనను గొంతు కోసి చంపిందని పోలీసులు తెలిపారు. మొదట తన చిన్న కొడుకు సింఘంపై దాడి చేయగా అతడు తప్పించుకున్నాడని.. అనంతరం సంజనను హత్య చేసిందని వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం తన భర్తపైనా ఇలానే దాడి చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం ఆమెను కేంద్ర కారాగారానికి తరలించారు. దీంతో అనారోగ్యంతో ఉన్న బిడ్డకూడా అనాథ అయ్యాడు.

Related Posts

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, మదనపల్లి, జులై 26:- మదనపల్లె టమోటా మార్కెట్లో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశిగంజ్ జిల్లా, నంగులా తానాకు చెందిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం