కొడుకు ఆరోగ్యం కోసం కూతుర్ని గొంతుకోసి చంపిన తల్లి.!

Spread the love

ఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నా.. అందరూ సమానమే. పెద్ద కొడుకు అనే మమకారం.. చిన్న కొడుకు అనే వెటకారం.. ఏ తల్లికీ ఉండదు. ఇక ఆడ పిల్లలైనా అంతే. తల్లికి పిల్లలే ప్రపంచం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన పిల్లలకు ఏ చిన్న దెబ్బ తగిలినా.. తల్లి విలవిల్లాడుతుంది. అందుకే అమ్మనుమించిన దైవం లేదని అంటారు. అమ్మ ఈ సృష్టిలో ఎక్కడైనా అమ్మే! కానీ ఓ తల్లి మాత్రం.. తన కొడుకు కోసం.. తన కూతురినే బలి ఇచ్చిందంటే.. నమ్మలేం. కానీ ఇది జరిగింది. మన దేశంలోనే రాజస్థాన్లో చోటు చేసుకుంది. మరి ఆ అమ్మ తెలియక చేసిందా?  తెలిసి చేసిందా?  తెలియదు కానీ మొత్తానికి ఘోరానికైతే పాల్పడి.. తన కడుపునకు తనే చిచ్చు పెట్టుకుని జైలుపాలైంది.

మూఢ నమ్మకంతో ఓ తల్లి.. కొడుకు కోసం కూతురిని చంపుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన కొడుకు ఎవరినైనా బలి ఇస్తే ఆరోగ్యంగా ఉంటాడని ఎవరో చెప్పగా విన్న ఆ తల్లి.. ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది.  మూఢ నమ్మకాలతో తన 12 సంవత్సరాల కూతురిని గొంతుకోసి చంపింది ఓ తల్లి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన 16 ఏళ్ల కొడుకు కోసం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిపింది.
రాజస్థాన్లోని బారాన్ జిల్లా అంట ప్రాంతంలో రేఖ హదా అనే మహిళ తన 16 ఏళ్ల కొడుకు నికేంద్ర సింగ్ను ఎంతో ప్రేమగా చూసుకునేంది. అతడికి గుండెలో రంధ్రం ఉంది. మానసిక స్థితి కూడా బాగుండేది కాదు. అతడి ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతున్న ఆమె ఎవరినైనా బలి ఇస్తే పెద్ద కొడుకు ఆరోగ్యంగా ఉంటాడని ఎవరో చెప్పగా నమ్మింది. దాంతో ఈ హత్యకు పాల్పడింది.ఈ మూఢ నమ్మకంతోనే ఆ మహిళ శనివారం తన కూతురు సంజనను గొంతు కోసి చంపిందని పోలీసులు తెలిపారు. మొదట తన చిన్న కొడుకు సింఘంపై దాడి చేయగా అతడు తప్పించుకున్నాడని.. అనంతరం సంజనను హత్య చేసిందని వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం తన భర్తపైనా ఇలానే దాడి చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం ఆమెను కేంద్ర కారాగారానికి తరలించారు. దీంతో అనారోగ్యంతో ఉన్న బిడ్డకూడా అనాథ అయ్యాడు.

Related Posts

భర్త లేని లోకంలో ఉండలేను

Spread the love

Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

Spread the love

Spread the love రాజపేట గురుకుల కళాశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థుల దాడి క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలు ర్యాగింగ్ ఘటన బయటకు రాకుండా లోలోపల ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన హాస్టల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!