నిధులు కేటాయించినా రంగథాముని చెరువు అభివృద్ధి లో జాప్యం ఎందుకు.. ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు

Spread the love

జనసంద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి జూన్ 21

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు… ముందుగా కాముని చెరువు సుందరీకరణ పనులను స్వయంగా పరిశీలించి అవసరమైతే హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని సేకరించి అత్యంత సుంద రీకరణంగా తీర్చిదిద్దాలని… కబ్జా అవుతున్న స్థలాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.. అలాగే బతుకమ్మ కుంటలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. అనంతరం రంగదాముని (ఐడియల్) చెరువు వద్ద ఆ ప్రాంతాన్ని అంతటినీ పరిశీలించి ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 19 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి సుందరీకరణ పనులు చేపట్టామని ఇందులో భాగంగానే ఇప్పటికే అత్యంత సుందరంగా కొంత ప్రాంతాన్ని తీర్చిదిద్దామని దాన్ని కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోవట్లేదని.. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అలాగే మిగిలిన అసంపూర్తిగా ఉన్న పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.. అనంతరం వివేక్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన అసోసియేషన్ సభ్యులు, అధికారుల సమీక్ష సమావేశంలో అసోసియేషన్ సభ్యుల అందించిన వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారులకు అందించారు… శక్తి నగర్, హబీబ్ నగర్, రోడ్ నెంబర్ వన్ వద్ద త్వరలోనే డ్రైనేజ్ సమస్య పూర్తి చేస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు… సేవాలాల్ నగర్ లోని సిసి రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు…ఈ నేపద్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ బాలాజీ నగర్ లో నూతన ధోభీ ఘాట్ కొరకు ప్రణాళికలు సిద్దం చేయాలని ..అలాగే వీధిలైట్లు ఒక నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అన్ని ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.. అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిధులు కొరత ఉంటే తనకు తెలపాలని ఆదేశాలు ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాలు బాబురావు, డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ,అన్ని విభాగాల అధికారులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు…

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి