బూడిద ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి.

Spread the love

జన సముద్రం న్యూస్, పినపాక, జూన్ 21.

  • కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం తరలింపు
  • మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు నిమ్మల వెంకన్న.

బీటీపీఎస్ బూడిదను తరలిస్తూ ఉన్న ట్రాక్టర్ బోల్తా
పడటంతో ఆదివాసి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన
సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.ప్రత్యక్ష సాక్షులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పినపాక మండలం,బోటిగూడెం పంచాయతీ, మారేడుగూడెం కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మాడే రామారావు (48) శుక్రవారం ఉదయం బిటి పిఎస్ ఉప్పాక బూడిద చెరువు నుంచి ట్రాక్టర్ లో బూడిద బస్తాలను తరలిస్తు ఉండగా బూడిద చెరువు కట్టపై అదుపుతప్పి పల్టీ కొట్టింది.ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ మాడే రామారావు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నర్సింహ రత్నం, కూతురు సమీరా ఉన్నారు.ఏడుళ్ల బయ్యారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం
నిమిత్తం రామారావు మృతదేహాన్ని మణుగూరు 100 పడకల ఆసుపత్రికి తరలించారు. రామారావు మృతితో మారేడు గూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని కూతురు రోదిస్తున్న తీరు చూపరులను, గ్రామస్తులను కంటతడి పెట్టించింది. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం, బీ టీ పీ ఏస్
యాజమాన్యం ఆదుకోవాలని మారేడు గూడెం గ్రామస్తులు,ఆదివాసి సంఘాల నాయకులు కోరారు.

*మృతుల కుటుంబానికి న్యాయం చేయాలి : సిపిఎం నిమ్మల వెంకన్న.

ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ రామారావు మృతి చెందడం బాధాకరమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న అన్నారు. బి టి పి ఎస్ యాజమాన్యం మృతుని కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్లాంట్ యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో బీటీపీఎస్ ప్రమాదంలో కార్మికుడు చనిపోతే 15 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేశారని, ఇప్పుడు కూడా ప్రమాదంలో మృతి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని తెలియజేశారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    భర్త లేని లోకంలో ఉండలేను

    Spread the love

    Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్