బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై సీనియర్స్ దాష్టీకం

Spread the love

జూనియర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి : దళిత బహుజన ఫ్రంట్ పల్నాడు జిల్లా కార్యదర్శి వి.మధుసూదన్ రావు డిమాండ్

జనసముద్రంన్యూస్, మే 20:

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై అదే కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న జూనియర్ యశ్వంత్ నాయుడు జేమ్స్ ని కులం పేరుతో తరచూ దూషిస్తూ ఉంటే తగదని వారించినందుకు కక్ష పెంచుకున్న జూనియర్ మరో ఇద్దరు జూనియర్స్, రౌడీషీటర్స్ తో కలిసి జేమ్స్ ని కారులో కిడ్నాప్ చేసి కత్తులతో తలపై కోసి హాకీస్టిక్లు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా కాళ్లు,చేతులు వెనక్కి కట్టి ఒకటిన్నర రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో అరవకుండా అండర్వేర్ (డ్రాయర్) నోట్లో కుక్కారు. అంతేకాకుండా మూత్రం నోట్లో పోసి త్రాగించారు. ఇది చాలా అటవిక చర్య. చదువుకొని విజ్ఞానం నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఇలా పనికిమాలిన అడవి జాతి మనుషుల్లాగా ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని పలనాడు దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు వి. మధుసూదన్ రావు అన్నారు. పోలీసు వారు కూడా కొంతమంది పేర్లు తొలగించి, వారిపై కేసులు పెట్టలేమని చిన్న నామాత్రపు కేసులు పెట్టి, ఫిర్యాదు పై సంతకం పెట్టించుకున్నారన్నారు.
దళిత విద్యార్థి జేమ్స్ పై దాడి చేసిన వారందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, కఠినమైన శిక్షలు అమలు చేయాలని, బాధితునికి రక్షణ కల్పించి మెరుగైన వైద్యం అందించాలని, ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని, మరలాఇలాంటి దుశ్చర్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని దళిత బహుజన ఫ్రంట్ పలనాడు జిల్లా కార్యదర్శి వడ్డే మధుసూదన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    భర్త లేని లోకంలో ఉండలేను

    Spread the love

    Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్