భద్రాచలం రామాలయంలో అత్యంతప్రాధాన్యత గలఆస్థానపురోహితున్ని వెంటనే నియమించండి.

Spread the love

జనసముద్రం న్యూస్, అక్టోబర్06 బ్యూరోచీఫ్:

వాల్మీకి రామాయణంలో సూర్యవంశగురు తుల్యులైన వశిష్ట మహర్షికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదోభక్త రామదాసు నిర్మించిన భద్రాచలం రామక్షేత్రంలో ఆస్థాన పురోహితునికి అంతేప్రాధాన్యం ఉన్నది.

భద్రాచలం రామాలయంలో ఏ ఏ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించాలో ఆస్థాన పురోహితులే నిర్ణయించడం భక్త రామదాసు గారి కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది.
సుప్రభాతంతో మేల్కొలిపి నశ్రీరామునికి పంచాంగ శ్రవణం ద్వారా ఆనాటి పంచాంగ విశేషాలను ఆస్థాన పురోహితులు తెలియజేస్తారు. పంచాంగ శ్రవణంతోనే శ్రీరాముని నిత్య పూజా కైoకర్యాలు మొదలవుతాయి.
అనంతరం మూల విరాట్కుజరిగే అభిషేకం సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చన మొదలుకొని స్వామివారినిత్య కళ్యాణం వరకు జరిగే నిత్య కైంకర్యాలలో ఆస్థాన పురోహితులే ప్రధాన పాత్ర పోషించేవారు.
శ్రీరామ నవమికి స్వామివారి కళ్యాణం, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో కూడా ఆస్థాన పురోహితులే నేతృత్వం వహించి కార్యక్రమాలు నిర్వహించేవారు.
రామాలయం ఆస్థాన పురోహితు నిగా స్వర్గీయ బ్రహ్మశ్రీ చల్లా కోదండరామయ్య శర్మ గారు బాధ్యతలు నిర్వహించినంత వరకు స్వామి వారి కైoకర్యాలు పైన తెలిపిన విధంగా నడుస్తుండేవి. కోదండరామయ్య శర్మ గారి అనంతరం వచ్చిన ఆస్థాన పురోహితుని పక్కన పెట్టిన అర్చకేతరులైన దేవాలయ సిబ్బంది ఒకరిద్దరు ఆస్థాన పురోహితునిపోస్టుపిల ప్ కాకుండా అడ్డుకున్నారు.
2022 జూన్ నెలలో నియమించవలసిన ఆస్థాన పురోహితుని పోస్టును 2 సంవత్సరాల మూడు నెలలు కాలం గడచినప్పటికీ నేటికీ ఆస్థాన పురోహితుని పోస్టు ఫిలప్ చేయలేదు. గత10 సంవత్సరాలుగా రామాలయం నకు ట్రస్ట్ బోర్డు రాకుండా ఈ ప్రబుద్ధులే అడ్డుకున్నారని గతంలో వినిపిస్తుండేది.

నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఆస్థాన పురోహి తుని పోస్ట్ నింపకపోవడం శ్రీరామ భక్తులను కలచి వేస్తోంది.
కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భద్రాచలం రామాలయం ఆస్థాన పురోహితున్ని వెంటనే నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్