తిరుమలేశ”… వాళ్ల పాపాల పండాయి అయ్యా..!

Spread the love

ఢిల్లీలోని ఆల్ఫా సంస్థకు అప్పగించాలని, ఆ ముగ్గురు కోరగా…!! వారు “నెయ్యికి బదులు” జంతువుల నూనెను వాడారు… అంటున్న “ఓవి రమణ”…??

వై వి సుబ్బారెడ్డి.. భూమన కరుణాకర్ రెడ్డి.. ధర్మారెడ్డి.. తప్పులకు “జగన్ రెడ్డి” శిక్ష అనుభవించక తప్పదు, అంటున్న టీటీడీ పాలకమండలి సభ్యుడు.. “ఓవి రమణ”.. చెప్పుకొచ్చారు…!!

100 కోట్లు పైబడి హిందువులున్న…ఈ “భారతదేశంలో”… ఇటువంటి కీచుకులని వదిలి పెట్టకూడదు… అంటున్న తిరుమలేశుని భక్తులు…!!

సిబిఐ ఎంక్వైరీ వేసి, ఎటువంటివారినైనా వదలకుండా… ప్రజల మధ్యలో… “ఉరితీయాలి”… అంటూ, ప్రభుత్వాన్ని కోరుతున్నాము.. అంటున్న ఆ తిరుమలేసిన భక్తులు…!!

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 20 జన సముద్రం న్యూస్

మునుపున్న వైసీపీ గవర్నమెంట్… తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది… చివరికి తిరుపతి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు…! వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది.. దానికి కారణం ఏమిటో చంద్రబాబు బయట పెట్టారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వును గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వాడినట్లుగా చంద్రబాబు కూటమి సమావేశంలో చెప్పారు…. జగన్ హాయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడితే.. తాము అధికారంలోకి రాగానే అన్నీ నాణ్యమైన పదార్థాలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నామన్నారు… చంద్రబాబు మిగతా విషయాలు చాలా చెప్పారు కానీ.. తిరుమలలో జరిగిన ఈ ఘోరం అంశం మాత్రం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. వైసీపీ హయాంలో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి పెత్తనం సాగేది. వీరు ముగ్గురూ అన్య మతస్తులన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రసాదం తయారీకి ఉపయోగించే పదార్ధాల విషయంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. మంచి క్వాలిటీ నెయ్యి ఇచ్చే వారిని తొలగించారు. తమ ఇష్టం వచ్చిన వారికి ఇచ్చారు. వారు యానిమల్ ఫ్యాట్ ను పంపారని తాజాగా పరిశోధనల్లో తేలింది దాంతో ఆ కాంట్రాక్టర్లను ఆపేయించారు.. ఈ విషయం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. చంద్రబాబు బయట పెట్టడంతో .. శ్రీవారి భక్తుల్లో విస్తృత చర్చ జరగనుంది. ఇలాంటివన్నీ బయటకు వస్తాయన్న కారణంగా కొద్ది రోజులుగా తిరుమలను టార్గెట్ చేసుకుని ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తిరుమలలో గత ఐదేళ్ల కాలంలో అత్యంత ఘోరమైన పనితీరు ఉండేది.. కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం దారిలో పెట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మేలుకొని.. “ఇటువంటి నీచమైన మృగాలను, ప్రజల మధ్యలో ఉరితీయాలని 100 కోట్ల హిందూ ప్రజానీకం కోరు కుంటుంది” అని… ఆ తిరుమలేసిన భక్తులు, ప్రజలు, విశ్లేషకులు, ధర్మకర్తలు, భారత దేశంలో ఉన్న ప్రజానీకం కోరుకుంటుంది…

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్