గర్భిణీ లింగ పిండ నిర్ధారణ నియంత్రణ చట్టాలను ప్రతిష్టముగా అమలుపరచాలి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్వర్ రెడ్డి

Spread the love

జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మార్చి 28

 ఏలూరు, మార్చి , 28 :   జిల్లాలో గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టంను  పటిష్టంగా అమలు చేసేందుకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.  స్థానిక కలెక్టరేటులోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టం అమలు జిల్లా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టంను  అమలు చేయని స్కానింగ్ సెంటర్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. స్కానింగ్ లో మగ బిడ్డా, ఆడ బిడ్డా అని తెలుసుకుని, ఆడ బిడ్డ అయితె అబార్షన్లు చేయించుకుంటున్నారన్నారు.  దీని కారణంగా సమాజంలో ఆడపిల్ల సంఖ్య తగ్గిపోతుందన్నారు.  సమాజంలో మగ ,ఆడ బిడ్డల నిష్పత్తి లో చాలా వ్యత్యాసం ఉంటుందన్నదని, ఇది చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు.   గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టంను మరింత పటిష్టవంతంగా అమలు చేసేందుకు జిల్లాలోని  ప్రతీ స్కానింగ్ సెంటర్ లపై నిఘా కెమెరాలతో 'డెకాయ్ ' ఆపరేషన్ లు నిర్వహించాలని, నిఘాలో నిబంధనలు పాటించకుండా చట్టాన్ని అతిక్రమించిన స్కానింగ్ కేంద్రాలను సీజ్ చేసి, సంబంధిత స్కానింగ్ కేంద్రాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.   జిల్లాలో గత మూడు నెలల్లో  వివిధ ఆసుపత్రులలో 136 అబార్షన్లు జరిగాయని, ప్రతీ కేసుపై సవివరమైన ఆడిటింగ్ చేయాలన్నారు.  వీటిలో సహేతుకమైన కారణాలు లేకుండా జరిగిన  అబార్షన్ లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, ప్రతీ కేసును క్షుణ్ణంగా   పరిశీలించాలని,   చట్టాన్ని అతిక్రమించి   అబార్షన్లు చేసిన ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలన్నారు.  స్కానింగ్ సెంటర్ లలో ఆసుపత్రుల నిర్వహిస్తూ, అబార్షన్లు చేసిన ఆసుపత్రులపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టంపై విద్యార్థినీ, విద్యార్థులకు  అవగాహన కలిగించేందుకు  పాఠశాల స్థాయిలో వ్యాసరచన, వ్రక్తుత్వ పోటీలు నిర్వహించాలని , పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందించాలన్నారు. స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు  కొత్తగా అందిన దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల మేరకు ఉన్నవాటికి అనుమతులు మంజూరు చేయాలన్నారు.  

సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ట, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డా.  పాల్ సతీష్, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా. నాగేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ మేరీ కేథరిన్,  ఐ సి డి ఎస్ పీడీ పద్మావతి, జిల్లా బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి, కమిటీ మెంబర్లు కె.బి. సీతారాం, ప్రభృతులు పాల్గొన్నారు.
  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్