కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటుందా…వెంటనే మనుకోక పోతే అదోగతే..!

Spread the love

జనసముద్రం న్యూస్, జూన్ 20:

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా లో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ కాలు నాదే.. ఆ కాలూ నాదే.. నా కాలు మీద కాలేసుకుంటే ప్రాబ్లం ఏంటీ అంటూ బన్నీ ఓ వ్యక్తిని ప్రశ్నిస్తాడు. ఆ సినిమా విషయం పక్కన పెడితే మీరు ఈ కాలు నాదే.. ఈ కాలు నాదే అని కాలు మీద కాలేసుకున్నారనుకో… మీరు ప్రమాదంలో పడినట్లే అని వైద్య నిపుణులు అంటున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారా? కుడివైపు లేదా ఎడమవైపు కాళ్లు క్రాస్ చేసి కూర్చున్న వారిలో మీరు ఒకరా? అయితే జాగ్రత్త. 62 శాతం మంది కాళ్ల ను  కుడివైపు క్రాస్ చేసి కూర్చొంటున్నారని తేలింది. ఇక 26 శాతం ప్రజలు ఎడమవైపు క్రాస్ చేస్తుంటారని… 12 శాతం మంది ఎటు వీలైతే అటు క్రాస్ చేస్తుంటారని ఓ అధ్యయనంలో తేలింది.ఇలా కాళ్ల ను క్రాస్ చేసి కూర్చోవడం వల్ల ప్రమాదమని అంటున్నారు వైద్యులు.  కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల హిప్స్ అమరిక లో తేడాలొస్తాయని చెబుతున్నారు. ఒకదాని తో పోలిస్తే మరొకటి పెద్దగా అవుతుందట. కాలు మోకాలు పాదం వంటి శరీరం లోని కింద భాగాల కు రక్తనాళాల ద్వారా జరిగే రక్త సరఫరా వేగంలో మార్పులు వస్తాయని చెబుతున్నారు. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

మోకాలి పై మోకాలు వేసుకుని కూర్చోవడం అత్యంత ప్రమాదకరమని..  ఇలా కూర్చోవడం వల్ల సిరలలో రక్త ప్రసరణ వేగం తగ్గి రక్తపోటు అధికమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా ఎక్కువ కాలం కూర్చుంటే…  ముందుకు వంగిపోయే గుణం భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలిందట.మెడ ఎముకల్లో మార్పులు రావడంతో తల భాగం అమరికలో కూడా మార్పులు వస్తుంటాయని చెబుతున్నారు. ఇక మగవారి లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వీర్య కణాల ఉత్పత్తి పై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు.  ఒకవేళ మీరూ కాలు మీద కాలేసుకుని కూర్చునే అలవాటు  ఉంటే మానుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు వైద్యులు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం