
- మామూలు మత్తులో అధికారులు…..
- రాజకీయ నాయకుల కనుసైగల్లో నడుస్తున్న మట్టి తవ్వకాలు….
- కానరాని అధికారులు, ఆందోళనలో ప్రజలు…
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి’5
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వెంచర్లు రాత్రి మట్టి తవ్వకాలు నడుస్తున్న
పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. వాటిని అరికట్టాల్సిన గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ అధికారులు మామూలు మత్తులో నిబంధనలకు తిరోధకాలిస్తున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వెంచర్లు ఏర్పాటు చేయాలంటే కనీసం 10 శాతం స్థలాన్ని గ్రామపంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కనీస సౌకర్యాలైన డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్తు మంచినీటి సౌకర్యం రోడ్లు పార్కు లాంటి వసతులు కల్పించి గ్రామపంచాయతీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ, మండల పంచాయతీ అధికారులు వాటిని పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే పంచాయతీ పాలకవర్గం ఆమోదంతో డిటిసిపి అనుమతికి పంపాలి. డిటిసిపి అనుమతులు వచ్చిన తర్వాత ప్లాట్లను విక్రయించాల్సి ఉంటుంది. రంగంపేట లో ఉన్న ఐదు వెంచర్లలో కనీస వసతులు కరువయ్యాయి.

అక్రమ పెంచర్లకు రాజకీయ నాయకుల అండ దండాలతోనే మట్టి వ్యాపారం నడుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు గానీ, పోలీసులు వివిధ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులు అక్రమంగా మట్టి తవ్వకాలు తవ్వితే ఎంతటి వారైనా శిక్షించాలని చెప్పిన విషయం అందరికి తెలిసిందే. గతంలో కొల్చారం మండలం కొంగోడు పాఠశాల ఆవరణలో జెసిపిలతో తీసిన గుంతలలో స్కూల్ విద్యార్థులు గుంతలో పడి చనిపోయిన విషయం అధికారులకు, పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంత జరుగుతున్న జెసిపిలతో మట్టి తవ్వకాలు తీసుకుంటూ వెంచర్లకు మట్టి సరఫరా చేస్తున్న అధికారులపై , పోలీస్ శాఖపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొల్చారం మండలం గ్రామ ప్రజలు కోరుతున్నారు…
*గ్రామపంచాయతీ పాలకవర్గం ఏం చేస్తుంది?
రంగంపేట గ్రామంలో అక్రమ వెంచర్లకు జెసిపి టిప్పర్లతో మట్టి తవ్వకాలు తవ్వి వెంచర్లకు సరఫరా చేస్తున్నా గ్రామపంచాయతీ పాలకవర్గం ఏం చేస్తుందో, అసలు గ్రామపంచాయతీ సిబ్బందికి ఎంత ఆముదాని ఉందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు , పోలీస్ శాఖ వారు వెంచర్లకు అక్రమంగా నడుస్తున్న మట్టి తవ్వకాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రంగంపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు.





