బీజేపీ తో కటీఫ్..మోడీతో భేటీకి కెసిఆర్ డుమ్మా

Spread the love

కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ ఇక నుంచి బీజేపీ ప్రభుత్వం పెట్టే సమావేశాలకు కూడా వెళ్లకూడదని పంతం పట్టాడు. రాష్ట్రపతి భవన్ లో డిసెంబర్ 5వ తేదీన రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరుగనుంది. జీ20 దేశాల కూటమికి ప్రస్తుతం భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ నాయకత్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రపంచంలో భారత్ ను నిలబెట్టేలా చేయాలనుకుంటున్నారు. అందుకోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ కు కూడా కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. అయితే మోడీతో సమావేశం అంటే కేసీఆర్ ఇటీవల కాలంలో పూర్తిస్తాయిలో దూరం పాటిస్తున్నారు. ఈ సమావేశానికి వెళ్లరని భావించవచ్చు. అయితే ఇది దేశానికి సంబంధించిన అంశం కాబట్టి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

నిజానికి కేసీఆర్ ఢిల్లీ టూర్ కూడా ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన వెంటనే వివిధ రాష్ట్రాల ఇన్ చార్జీలను ప్రకటించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలపై ఓ స్పష్టత వచ్చింది. రైతు సంఘాల నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో చిన్న పార్టీలతో కలిసి నడుస్తారు. అయితే ఇలాంటి వారందరితో కేసీఆర్ ఢిల్లీలో చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయన ఢిల్లీ వెళతారని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ఆలస్యంతో ఆయన ఢిల్లీ టూర్ వాయిదా పడుతోంది.

ఇక డిసెంబర్ 7వ తేదీలోపున టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారే అవకాశాలున్నాయి.బీఆర్ఎస్ గురించి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో ప్రకటించాలనుకోవడం లేదు. జాతీయస్థాయిలోనే ప్రకటన ఉండనుంది.

అందుకే బీఆర్ఎస్ గురించి కేసీఆర్ ప్రస్తావించడం లేదు.  దేశ ప్రజలందరి ముందు తన ఆలోచనలు జెండా అజెండా ప్రకటించాలనుకుంటున్నారు. అందుకే ఇతరులతో చర్చలు జరపడం లేదు. ఈ క్రమంలోనే మోడీ పర్యటనకు వెళతారా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది.

  • Related Posts

    సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరం

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61…

    తీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం