ఆధార్ తీసుకొని పదేళ్లు అయ్యిందా..వెంటనే అప్డేట్ చేసుకోండి : భారత విశిష్ట ప్రాధికార సంస్థ

Spread the love
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 25 ;

అవసరం ఏదైనా కానీ.. ధ్రువీకరణ అన్నంతనే వచ్చే మాట.. ఆధార్. ప్రతి ఒక్క చోట ఆధార్ అవసరమే. అదే లేకుంటే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మరి.. అలాంటి ఆధార్ ను తీసుకొని పదేళ్లు అయితే.. దాన్ని వెంటనే అప్డేట్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఆధార్ కార్డు జారీ అయ్యాక.. పదేళ్ల కాలంలోఅప్డేట్ కాని వారంతా తమ ఆధార్ కార్డుల్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
చిన్న పిల్లలు మొదలు పెద్ద వయస్కుల వారి వరకు ప్రతి ఒక్కరు తమ ఆధార్ ను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోజువారీ జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఆధార్ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి. అంతటి కీలకమైన ఆధార్ ను పదేళ్లకు ఒకసారి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
తాజాగా భారత విశిష్ట ప్రాధికార సంస్థ ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలని కోరింది.
ఇందులో భాగంగా ఆధార్ లో మన డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవటానికి వీలుగా ఆధార్ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన అప్డేట్ డాక్యుమెంట్ అనే ఫీచర్ ను తాజాగా జత  చేసింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో యూజర్లు తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన పత్రాల్ని అప్డేట్ చేసుకోవచ్చని.. తమ వద్ద ఉన్న ఆధార్ కేంద్రాల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చిన పేర్కొన్నారు.
దేశంలో అమలవుతున్న 1100లకు పైగా ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అన్నది మర్చిపోకూడదు. దీని ద్వారానే లబ్థిదారుల్ని ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినప్పుడు దేశంలో ఇప్పటివరకు 134 కోట్ల ఆధార్ నెంబర్లు జారీ అయ్యాయి.
ప్రస్తుతం తాము నివసిస్తున్న చిరునామాకు అనుగుణంగా ఆధార్ ను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇందుకోసం గత నెలలో ఆధార్ నిబంధనల్ని మార్చి.. పదేళ్లకు ఒకసారి ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలన్న సూచన చేశారు. మరెందుకు ఆలస్యం.. మీ ఆధార్ ను అప్డేట్ చేసుకోండి.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    One thought on “ఆధార్ తీసుకొని పదేళ్లు అయ్యిందా..వెంటనే అప్డేట్ చేసుకోండి : భారత విశిష్ట ప్రాధికార సంస్థ

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం