శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కైలాస సదన్ అతిథి గృహానికి 16 లక్షలు విరాళం

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2:

శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన భరద్వాజ తీర్థం (లోబావి) నందు భక్తులకు బస సౌకర్యార్థం నూతనంగా నిర్మించి ప్రారంభించిన 125 గదుల కైలాస సదన్ అతిథి గృహం నందు దాతలు భాగస్వామ్యం అయ్యేలా దేవస్థానం విరాళాల స్వీకరణ కొనసాగిస్తున్నది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు గారికి శ్రీ గీతభ్యాసరత సమాజం భరద్వాజ తీర్థం శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీశ్రీశ్రీ రామ్మూర్తి స్వామి వారు ఇదివరకు స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన సందర్భంలో వారికి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దగ్గరుండి ఆలయం నందు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి అమ్మవార్ల ఆలయంలోని పలు సేవా కార్యక్రమాలు మరియు భక్తులు అందజేయు విరాళాలు గూర్చి తెలియజేయటం జరిగినది. ఇందులో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన కైలాస సదన్ గదుల విరాళాల గూర్చి వారికి తెలియజేసి, వారిని వెంట తీసుకెళ్లి కైలాస సదన్ అతిథి గృహమును సందర్శింపజేసి వారిని విరాళం అందజేయవలసిందిగా ఛైర్మన్ వారిని కోరడం జరిగినది. శ్రీ రామ్మూర్తి స్వామి వార ఆలయనికి విచ్చేసి ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారి సమక్షంలో కైలాసదన్ అతిధి గృహంలోని మొదటి బ్లాక్ లోని గది నెం:5,6 రెండు సింగల్ రూములకు గాను ఒక్కొక్క రూముకు 8 లక్షల రూపాయల చొప్పున రెండు సింగల్ రూములకు గాను విరాళంగా 16,00,000/- (పదహారు లక్షల రూపాయలు) చెక్కును చైర్మన్ గారికి అందజేశారు. వారికి దేవస్థానం చైర్మన్ అభినందనలు తెలియజేసి, ఘనంగా శేష వస్త్రములతో సత్కరించి, వేద పండితులతో వేదమంత్రాలతో ఆశీర్వచనాలు ఇప్పించి, స్వామి అమ్మవార్ల వస్త్రాలను, చిత్రపటాన్ని మరియు తీర్థప్రసాదాలను అందజేసి తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని యొక్క చల్లని దీవెనలు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన కైలాస సదన్ అతిథి గృహాల సముదాయం నందు గల రెండు బ్లాక్స్ లోని 125 గదుల్లో 101 సింగిల్ రూమ్స్, 24 సూటు రూమ్స్ ఉన్నాయని, ఒక్కొక్క సూట్ రూమ్ కు 15 లక్షలు చొప్పున, ఒక్కొక్క సింగిల్ రూమ్ కు 8 లక్షలు చొప్పున దాతలు విరాళం చెల్లించి స్వామిఅమ్మవార్ల సేవలో భాగస్వామ్యం అయ్యేవిధంగా దేవస్థానం అవకాశం కల్పించిందన్నారు. దాతలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విరాళంగా పొందిన గదులను దాతల కుటుంబాలకు మరియు వారు తెలియజేసిన వారికి ఒక్క సంవత్సరానికి 45 రోజుల వరకు ఉచితంగా బస వసతి కల్పిస్తున్నామని, కావున భక్తులు దేవస్థానం అతిథి గృహాల్లో దాతలు భాగస్వామ్యం అయి ఆ కైలాసనాధుని సేవలో తరించే విధంగా దాతలకు అవకాశం కల్పిస్తున్నట్లు కోరిన విధంగానే దాతలు ముందుకొస్తున్నారని, అదేవిధంగా మన ప్రాంత వాసులు ముందుకు రావాలని, ఇతర ప్రాంతాల భక్తులకు కూడా తెలియజేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనింపజేయాలని చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏసి మల్లికార్జునరావు, విజయలక్ష్మి, చెంచు రాఘవులు, నరసింహ గుప్త ,చంద్రశేఖర్ రాజు ,ప్రమీలమ్మ ,సుధాకర్ రాజు ,కళ్యాణ్ చక్రవర్తి ,శివశంకర్ ,శ్రీనివాస్,అయ్యప్ప మరియు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం